కేంద్రంలోని బీజేపి అదేశాలతో రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేసేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్సు అధికారులను ఆ రాష్ట్రానికి పంపిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులను ఆ రాష్ట్రానికి పంపించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. వాటిన అంచనా వేసిన తరువాత రూపోందించే నివేదికను బట్టే బీజేపి అభ్యర్థులను బరిలోకి దింపనుందని తమకు నిర్థిష్ట సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే నేపథ్యంలోనే ఆయనకు తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ పదవిని బీజేపి కట్టబెట్టిందని, అందుకు కూడా తెరవెనుక కారణం కేసీఆర్ అని ఆయన అరోపించారు. గెలిచే అవకాశాలు వున్న చోట్ల తమ అభ్యర్థులకు బరిలో దింపేందుకు ఇంటెలిజెన్స్ నివేదిక అవసరపడుతోంది. మన రాష్ట్రానికి చెందిన అధికారులను ఇతర రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి పంపే ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ఒకే ఠాను ముఖ్కలని.. అక్కడ అన్నాడీఎంకేతో కలిసి పోటీచేస్తున్న బీజేపి ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ తో రహస్య స్నేహం పాటిస్తుందని ఆయన పేర్కోన్నారు. అవినీతి కేసులను అడ్డం పెట్టుకుని ప్రధాని మోడీ.. కేసీఆర్ ను లొంగదీసుకున్నారని అరోపించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానని ప్రధాని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు బీజేపీకి కేసీఆర్ నిధులను సమకూరుస్తున్నారని అరోపించారు. తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు ఆటలో అరటిపండ్లవారని విమర్శించారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న వారు.. ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని రేవంత్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more