తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలిగా, అన్నా డీఎంకే పార్టీకి మాజీ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పన చిన్నమ్మగా పేరొందిన వీకే శశికళ నాలుగేళ్ల తరువాత జైలు జీవితం నుంచి విముక్తురాలయ్యారు. అక్రమాస్థుల కేసులో వికే శశికళ నాలుగేళ్ల పాటు బెంగళూరులోని పరప్పనా అగ్రహారం జైలులో విశణు అనుభవించారు. అమె జైలు నుంచి విడుదల అయినా.. మరో ఐదు రోజుల పాటు మాత్రం విక్టోరియా అసుపత్రిలోనే చికిత్సను పోందనున్నారు.
జనవరి 20వ తేదీన అమె కరోనా బారిన పడ్డారు. తీవ్ర జ్వరం, శాస్వ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అమెను హుటాహుటిన ప్రభుత్వ బోరింగ్ అసుపత్రికి తరలించిన జైలు అధికారులు చికిత్సను అందించారు. అమెకు పరిస్థితి విషమంగా వుండటంతో అమెను తరువాత విక్టోరియా అసుపత్రికి తరలించిన జైలు అధికారులు అక్కడ ఐసీయూలో చికిత్సను అందించారు. అమె పరస్థితి ప్రస్తుతం నిలకడగానే వుందని అమె కోలుకుంటున్నారని చెప్పిన వైద్యవర్గాలు అమెకు ఇప్పటికీ అక్సీజన్ అందిస్తున్నామని చెప్పారు.
అయితే కరోనా మహమ్మారి ప్రోటోకాల్ ప్రకారం అమె జైలు నుంచి విడుదలైనా.. మరో ఐదు రోజుల పాటు మాత్రం అమె అసుపత్రిలోనే చికిత్స పోందాల్సివుంది. కరోనా నెగిటివ్ నివేదిక వచ్చే వరకు అమె అసుపత్రి నుంచి డిశ్చార్జీ కారని అమె తరపు న్యాయవాది తెలిపారు. కాగా అసుపత్రి వర్గాలతో చర్చించిన పిమ్మట డిశ్చార్జీపై నిర్ణయం తీసుకుంటామని శశకళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం అమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమె ఆరోగ్యం మెరుగ్గానే వుందని అసుపత్రి వర్గాలు కూడా వెల్లడిందాయి.
దీంతో అసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అమె అభిమానులు అమెకు మద్దతుగా నినాదాలు చేశారు. మరికొందరు అమె జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో స్వీట్లు పంచిపెట్టారు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి రూ.79 కోట్లతో నిర్మించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మృతిచిహ్నాన్ని అవిష్కరించనున్నారు. ఇక మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో అమె విడుదల కావడం.. అరవ అసెంబ్లీ ఎన్నికలపై ఏదైనా ప్రభావం చాటుతుందా.? అన్న కోణంలోనూ రాజకీయ పరిశీలకులు పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది.... Read more
Mar 03 | రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవలంబిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వలసలు వస్తాయని వైసీపీ రాజ్యసభ... Read more
Mar 03 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలే వున్నారని అరోపణలు రావడంతో హత్య జరిగిన... Read more
Mar 03 | ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి... Read more
Mar 03 | ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో... Read more