2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు, పరిమితులు మధ్య ప్రజలకు కరెన్సీని అందించారు. దీంతో గంటల కోద్ది సమయం, రోజులకు రోజులు ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద క్యూ కట్టిన ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు అందరికీ గుర్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోమారు నోట్ల రద్దుకు కేంద్రం పూనుకుంటుందని అటు సోషల్ మీడియా, ఇటు మీడియాలో వార్తలు పెను సంచలనంగా మారాయి. దీంతో సామాన్యులలో అందోళన రేకెత్తుతోంది.
ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ లోపు పాత చిన్న నోట్లను రద్దు చేస్తారన్న వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కోడుతోంది. సామాజిక మాద్యమాలతో పాటు మీడియాలోని ఓ వర్గంలో కూడా ఈ వార్తలు ప్రచురించాయి, దీంతో సామాన్యులలో అందోళన రేకెత్తున్న తరుణంలో ఈ అంశంపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వ నిజనిర్థారణ బృంధం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక వాస్తవాన్ని ప్రజలకు చేరవేసింది. పాత చిన్న నోట్ల రద్దును చేపడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని, ఈ తరహా వార్తలను విశ్వసించరాదని పేర్కోంది.
పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను రద్దు చేస్తున్నారన్న వార్త సత్య దూరమని స్పష్టతను ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 2018లో కొత్త రూ.10, రూ. 50, రూ.200 నోటును ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత 2019లో కొత్త రూ.100 నోటును కూడా చలమణిలోకి తీసుకువచ్చింది. లావెండర్ వర్ణంలో వున్న ఈ కొత్త రూ. 100 నోట్లపై గుజరాత్ రాష్ట్రంలోని యూనెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రాణికి వావ్ ను ముద్రించింది. దీంతో 900 సంవత్సరాల పురాతన నిర్మాణ అద్భుతంతో సహా నీటి పవిత్రతను కూడా ప్రదర్శిస్తూ వుంది, ఈ కొత్త నోటును చలామణిలో తీసుకురావడంతో పాత నోట్లు పై ప్రచారం జోరందుకుంది. కాగా ఈ ప్రచారంలో నిజంలేదని తేల్చిచెప్పింది. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని భారతీయ రిజర్వు బ్యాంకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more