కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్ కు వేళ్లాడుతున్న స్థితిలో గుర్తించారు. అమెది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీర్ఘకాలికంగా అమె మానసిక ఒత్తడికి గురయ్యారని, దానిని అధిగమించేందుకు చికిత్స పోందుతున్న ఆమె.. చివరకు దానికే బలయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
బెంగళూరులో మగది రోడ్ లోని ప్రగతి లే అవుట్ లో నివసిస్తున్న జయశ్రీ.. కన్నడ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 3లో అమె ప్రవేశించి రాష్ట్రప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న తరువాత కూడా అమెకు సినిమా అవకాశాలు మాత్రం ఆశించినంతగా దక్కలేదు. దీంతో అమె మానసిక ఒత్తడికి గురైంది. ఈ క్రమంలో గత ఏడాది జూలై నెలలో అమె పెట్టిన ఓ ట్వీట్ కూడా పెను సంచలనంగా మారింది. ఈ ప్రపంచం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పోందాలని భావిస్తున్నాను.. గుడ్ బై అంటూ ఓ పోస్టు పెట్టింది. ఆ తరువాత అమెకు అండగా నెట్ జనులు కామెంట్లు చేయడంతో దిగివచ్చి దానిని తొలగించిన నటి తాను క్షేమంగానే వున్నానని పేర్కోంది.
ఇక డిప్రెషన్ ను అధిగమించేందుకు అమె స్థానిక సంథ్య కిరాణా ఆశ్రమంలో చేరి చికిత్స కూడా తీసుకుంటోంది. ఇక అంతా సర్ధుకుంటోంది అన్న తరుణంలో అమె ఇలాంటి చర్యకు పాల్పడుతుందని అనుకోలేదని అమె స్నేహితురాలు శిల్ప పేర్కోంది. గత రాత్రి నుంచి అమె తన కుటుంబసభ్యుల సందేశాలకు, ఫోన్ కాల్స్ ను స్పందించకపోవడంతో ఆశ్రమాన్ని సంప్రదించగా వారు వెళ్లి చూసే సరికి అమె విగతజీవిలా పడివుందని శిల్ప తెలిపారు. కాగా, జయశ్రీ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నటి మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆమె మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది.... Read more
Mar 03 | రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవలంబిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వలసలు వస్తాయని వైసీపీ రాజ్యసభ... Read more
Mar 03 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలే వున్నారని అరోపణలు రావడంతో హత్య జరిగిన... Read more
Mar 03 | ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి... Read more
Mar 03 | ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో... Read more