ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా ఎన్నికలు జరుగుతాయా.? లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా సస్పెన్ కోనసాగుతోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎవరి పక్షాన తీర్పును వెలువరిస్తోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలగా వుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎన్నికలలో పాల్గోనబోమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలను నిర్వహించాల్సిన అవశ్యకత ఏమీటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఓ వైపు కరోనా వాక్సీన్ ను ప్రజలకు అందించాల్సిన అత్యవసర పరస్థితులు నెలకొన్న తరుణంతో ఉద్యోగులు అందుకు సిద్దమవుతున్న తరుణంలోనే పంచాయతీ ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి.. తమ జీవితాలతో ఆటలాడే అధికారం నిమ్మగడ్డకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కాపు హక్కుల వేదిక నాయకుడు ముద్రగడ ప్రద్మనాభం ఓ లేఖను రాయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి వెనుక ఏదో తెలియని అదృశ్య శక్తి ఉందని, అదే ఎన్నికలపై ఆయనను ఒత్తిడి చేస్తోందని అన్నారు.
ఆయన లేక సాగిందిలా.. "మీ నిర్ణయాల వెనుక ఏదో అదృశ్య శక్తి ఉండి నడిపిస్తున్నట్టుంది. ఎన్నికల కమిషన్ ఇంత పట్టుదలతో అడుగులు వేస్తుండటాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. ఎవరి ప్రోద్బలంతోనో మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి మొండి పట్టుదల తగదని భావిస్తున్నాం. కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గి, ఉద్యోగులకు వ్యాక్సిన్ అందించిన తరువాత ఎన్నికలు జరపించడానికి అభ్యంతరాలేంటి?" అని తన లేఖలో ముద్రగడ ప్రశ్నించారు. ఇక ఇలాంటి ప్రశ్నలను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, అధికార పార్టీ వర్గాలు లేవనెత్తిన తరుణంలో ముద్రగడ కూడా అలాంటి ప్రశ్నలే సంధించడం దుమారం రేపుతోంది.
ఇక ఇవాళ్టి నుంచి తొలి ధశ నామినేషన్ల ప్రక్రియకు తెర లేచిన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు మాత్రం ఏక్కడ జరగలేదని తెలుసుకున్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ఇవాళ ఉదయాన్నే కార్యాలయానికి విచ్చేశారు. నామినేషన్ల పర్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఈ క్రమంలో మైనారిటీ తీరిన వారికి కూడా ఓటు హక్కు కల్పించిన తరువాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more