టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై ఆయనను విచారణకు మాత్రమే పిలిచామని అయితే ఆయన మూడు పర్యాయాలు పోలీసులు పిలిచినా రాకపోవడంతో ఆయన ఇంటికి పోలీసులు వెళ్లి తీసుకువచ్చారని తెలిపారు. ఆ రోజులన ఏం జరిగిందన్న విషయమై ఆయన నుంచి వాంగ్మూలం తీసుకన్న తరువాత ఆయనను వ్యక్తిగత పూచికత్తుపై పోలీసులు విడిచిపెట్టారని అమె తెలిపారు. అంతేకానీ అరెస్టు పర్యాలు కోనసాగిన కథనాలు వాస్తవ దూరమని అన్నారు.
రాజాంలోని ఆయన ఇంటికి వెళ్లిన నెల్లిమర్ల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం.. అంతకు ముందు ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించడం కూడా ఆయనను అరెస్టు చేశారన్న వార్తలకు బలం చేకూరింది. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఆయన బోజనానికి ఉపక్రమించే సమయానికి చేరుకున్న నెల్లిమర్ల పోలీసులు.. ఆయనను నెల్లిమర్ల నుంచి చీపురుపల్లికి తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థంలో పర్యటించిన సమయంలో అక్కడికే వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పుల దాడి జరిగిన ఘటనపై విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయనను విడిచిపెట్టారు.
రామతీర్థం ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కళా వెంకట్రావుపైనా కేసు నమోదు చేశారు. ఇక ఆయనను అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో రాజాంలో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి, టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు ఒక్కసారిగా కళా వెంకట్రావు ఇంటి ఆవరణకు చేరుకున్నారు. అటు టీడీపీ కూడా అక్రమ అరెస్టులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించి.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా తెరలేపింది. దీంతో అర్థరాత్రి సమయంలో కళా వెంకట్రావును విడిచిపెట్టిన పోలీసులు.. ఆయనను కేవలం విచారణ నేపథ్యంలోనే పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్లామని, ఆనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశామని చెప్పడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more