తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని మనోవికాస్ నగర్ కు చెందిన సీఎం బందువుల ఇంటికి ఐటీ అధికారుల పేరుతో చోరబడిన అగంతకులు ప్రవీణ్ రావు, అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను సినీపక్కిలో నిన్న రాత్రి కిడ్నాప్ చేశారు, కాగా వారి బంధువలు పిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపగా, ముగ్గురినీ వికారాబాద్ లో గుర్తించి.. కిడ్నాపర్ల నుంచి రక్షించారు, వారంతా సురక్షితంగా వున్నారని పోలీసులు తెలిపారు, దీంతో సీఎం బంధువుల కిడ్నాప్ కేసు సుఖాంతమైంది.
కాగా, ఈ కేసులో మొత్తం ఘటన వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి మహిళా పోలీసు స్టేషన్ లో ఆమెను విచారించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి భూమా అఖిలప్రియను అరెస్టు చేయగా, భూవ్యవహారానికి సంబంధించే ఈ ఘటన చోటుచుసుకున్నట్లు తెలుస్తోంది, ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
సీఎం బంధువుల ఇంటికి మూడు కార్లలో వచ్చిన దుండగులు ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమతో రావాలని వారిని కార్లలో తీసుకెళ్లారు, వారితో పాటు ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ల కూడా స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు ఐటీ అధికారులు అదుపులోకి ఎలా తీసుకుంటారని, ఇది కిడ్నాప్ అని అనుమానంతో హైదరాబాద్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు సీపీ అంజనీకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రత్యేక బృందాలను, టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ప్రవీణ్ రావు కిడ్నాపైన విషయం తెలియడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more