(Image source from: Telugubulletin.com)
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలపై దాడులకు చెక్ పడటం లేదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై ఓ వైపు రాస్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్ని ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చిన తరుణంలో తాజాగా మరో దేవాలయంలోనూ దేవతా విగ్రహాల ధ్వంసం కోనసాగింది. బీజేపి, జనసేన పార్టీలు రామతీర్థం ధర్మయాత్రను చేపట్టడం.. అందుకు పోలీసులు అనుమతిన నిరాకరించడం.. ఈ క్రమంలో అరెస్టులు, పోలీసులకు బీజేపి, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన కలకలం రేపింది.
ప్రకాశం జిల్లాలోని సింగరాయ కొండ మండలంలోని పాత సింగరాయకొండలో చారిత్రక నేపథ్యమున్న దేవాలయాన్ని దుండగలు టార్గెట్ చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయులు నిర్మించిన దేవాలయం.. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిచెందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని టార్గెట్ చేసిన దుండగులు.. ఆలయానికి వెళ్లే ముఖ ద్వారం (కమాన్)పై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ, శ్రీ గరుత్మంతుడు మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో దేవతామూర్తుల విగ్రహాల చేతులు విరిగిపోయాయి. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ముఖద్వారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి దాడి జరగలేదని నిర్ధారించారు. దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్మించిన ముఖద్వారం కావడంతో సిమెంట్ పెచ్చులు విరిగిపడ్డట్లు తేల్చారు. ఇక ఆ ప్రాంతమంతా అదుపులోకి తీసుకుని బందోబస్తు నిర్వహించారు. ప్రకాశం జిల్లా అదనపు ఎస్సీ బి.రవిచంద్ర ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహాలు ధ్వంసం చేశారంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ఆలయ ఈవో బైరాగి కూడా ఇది దుండగులు చేసిన పనిగా నిర్థారించలేదు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more