కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ లను పోలీసులు పక్కన బెట్టారు. కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిని మాత్రమే టార్గెట్ చేసిన పోలీసులు వారిపై జరిమానాలు విదిస్తూ వస్తున్నారు. అయితే అన్ లాక్ తరువాత పెద్దగా ఏ పండగ పర్వదినాలను కూడా పెద్దగా జరుపుకోని రాష్ట్ర ప్రజలు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే నూతన సంవత్సర ఆహ్వాన పండుగను పోలీసులు టార్గెట్ చేసుకున్నారు. ఈ వేళన ఎన్నడూ మద్యం రుచించని వారు కూడా స్నేహితులతో కలసి మద్యం సేవిస్తారని తెలిసి ముందునుంచే అప్రమత్తం చేస్తూ వచ్చారు. అంతేకాదు నాలుగు రోజుల ముందునుంచే తనిఖీలు చేపట్టారు.
కాగా నూతన సంవత్సరాది వేడకలపై జరుపుకునే చర్యలపై చెక్ పెట్టని ప్రభుత్వం.. మద్యం బాబులపై మాత్రం నజర్ పెట్టింది. ఈ మేరకు వారం రోజుల ముందునుంచే మందుబాబులను పలు మాధ్యామాల ద్వారా అప్రమత్తం చేస్తూ వచ్చిన పోటీసులు మందుబాబులు మద్యం సేవించి వాహనాలను నడిపితే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారి చేసింది. అయితే పోలీసులు హెచ్చరికలను కూడా పెద్దగా పట్టించుకోని మందుబాబులను నూతన ఏడాది అహ్వానించే డిసెంబర్ 31న గ్రేటర్ హైదరబాద్ సహా శివారు ప్రాంతాలను ఎంచుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మోహరించి.. అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిపారు.
ఫలితంగా డిసెంబర్ 31 న ఏకంగా 1500 మందిని మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 27 నుంచే ఈ తనిఖీలు చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల వ్యవధఇలో ఏకంగా 3571 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజునే 971 మంది మందుబాబులను సైబరాబాద్ పోలీసులు తమ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రాచకోండ పోలీసులు తమ కమీషనరేట్ పరిధిలో ఏకంగా 387 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more