కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ లను పోలీసులు పక్కన బెట్టారు. కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిని మాత్రమే టార్గెట్ చేసిన పోలీసులు వారిపై జరిమానాలు విదిస్తూ వస్తున్నారు. అయితే అన్ లాక్ తరువాత పెద్దగా ఏ పండగ పర్వదినాలను కూడా పెద్దగా జరుపుకోని రాష్ట్ర ప్రజలు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే నూతన సంవత్సర ఆహ్వాన పండుగను పోలీసులు టార్గెట్ చేసుకున్నారు. ఈ వేళన ఎన్నడూ మద్యం రుచించని వారు కూడా స్నేహితులతో కలసి మద్యం సేవిస్తారని తెలిసి ముందునుంచే అప్రమత్తం చేస్తూ వచ్చారు. అంతేకాదు నాలుగు రోజుల ముందునుంచే తనిఖీలు చేపట్టారు.
కాగా నూతన సంవత్సరాది వేడకలపై జరుపుకునే చర్యలపై చెక్ పెట్టని ప్రభుత్వం.. మద్యం బాబులపై మాత్రం నజర్ పెట్టింది. ఈ మేరకు వారం రోజుల ముందునుంచే మందుబాబులను పలు మాధ్యామాల ద్వారా అప్రమత్తం చేస్తూ వచ్చిన పోటీసులు మందుబాబులు మద్యం సేవించి వాహనాలను నడిపితే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారి చేసింది. అయితే పోలీసులు హెచ్చరికలను కూడా పెద్దగా పట్టించుకోని మందుబాబులను నూతన ఏడాది అహ్వానించే డిసెంబర్ 31న గ్రేటర్ హైదరబాద్ సహా శివారు ప్రాంతాలను ఎంచుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మోహరించి.. అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిపారు.
ఫలితంగా డిసెంబర్ 31 న ఏకంగా 1500 మందిని మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 27 నుంచే ఈ తనిఖీలు చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల వ్యవధఇలో ఏకంగా 3571 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజునే 971 మంది మందుబాబులను సైబరాబాద్ పోలీసులు తమ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రాచకోండ పోలీసులు తమ కమీషనరేట్ పరిధిలో ఏకంగా 387 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more