నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయం, రాష్ట్రపతి భవనం, ఇండియా గేట్ సహా దేశరాజధానిలోని పలు అభివృద్ది పనుల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రాజెక్టు విస్టాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం, స్థలం కేటాయింపు, డిజైన్ల అమోదం, పర్యావరణ అనుమతులు లభించడం వంటి వ్యవహారాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు పిటీషన్లను దాఖలయ్యాయి. వీటిపై విచారించన న్యాయస్థానం ఇవాళ్టికీ తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఉదయం విస్టా ప్రాజెక్టుపై తీర్పును వెలువరిస్తూ పచ్చజెండాను ఊపింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం చేసిన వాదనలతో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది.
త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విస్టా ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పును వెలువరించారు. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు 2:1 నిష్పత్తిలో మెజార్టీ తీర్పుతో గ్రీన్ సిగ్నల్ లభించింది. జస్టిస్ ఖాన్విల్కర్ తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఏకాభిప్రాయంతో తీర్పును రాశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాత్రం విడిగా తీర్పు కాపీని రాశారు. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్లపై కేంద్రం వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది.
కాగా ప్రాజెక్టు నిర్మాణానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఆ అనుమతులను తక్షణం తెచ్చుకోవాలని సూచించిన న్యాయస్థానం.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయాలని అదేశించింది, యాంటీ స్మాగ్ గన్ లను ఉపయోగించాలని కూడా అదేశించింది. ఆ తరువాతనే నిర్మాణాలను చేపట్టాలని సూచనలు చేసింది. కాగా ఈ కేసు విచారణ సమయంలోనే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు శంకుస్థాపనకు అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం అంగీకారం తెలిపింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ప్రాజక్టుకు శంకుస్థాపన చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more