(Image source from: Pressmediaofindia.com)
నైజర్ దేశాధ్యక్షుడి ఎన్నికల తొలి విడత ఫలితాలు వెలువడుతున్న వేళ అ దేశంలో రక్తపేటేరులు పారాయి. ప్రతీకారేచ్చతో రగలిపోతున్న ఉగ్రవాద మూకలు రెండు గ్రామాలపై తెగబడి కనిపించిన వారందరినీ తుపాకీ తూటాలతో బలితీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపైగా ప్రజల ప్రాణాలను హరించారు. తమపై అనునిత్యం దౌర్జన్యం చేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను కొట్టి చంపడమే అక్కడి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఇద్దరు ఉగ్రవాదుల కోసం రెండు గ్రామాల ప్రజల ప్రాణాలను హరించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్ లో జరిగింది.
అయితే తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఆగడాలను భరించలేకపోయిన గ్రామస్థులు వారిని కొట్టి చంపారు. అయితే ఈ విషయం తెలిసుకున్న ఉగ్రవాద సంస్థ.. తమకు మద్దతుగా వున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు పాకిస్థాన్ కు చెందిన అల్ ఖైధా ఉగ్రవాద సంస్థల సహకారంతో అర్థరాత్రి ఊరంతా నిద్రిస్తున్న వేళ.. గ్రామంలోకి చొచ్చుకోట్టి.. కనపించినవారిపై తుపాకీ తూటాలను దింపారు. ఈ దారుణం గురించి స్థానిక అధికారుల ద్వారా సమాచారం అందుకున్న అ దేశ ప్రధాని బ్రిగి రఫిని.. బాధిత రెండు గ్రామాలైన టోంబాంగౌ, జారౌమ్ దారే లకు వెళ్లి అక్కడి పిరస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజర్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద మూకల దాడులలో హతులైన గ్రామ ప్రజలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాని, ప్రజలకు అండగా తాము వుంటామని ఈ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు నమ్మకం కలిగించేందుకు వచ్చామని అన్నారు. దేశాధ్యక్షుడు తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. తమతో పాటు యావత్ దేశం గ్రామ ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు, పశ్చిమాఫ్రియా సరిహద్దు గ్రామాలతో పాటు నైజర్ ప్రజలకు కూడా నిత్యం ఉగ్రవాద ప్రభావితానికి గురివుతూనే వున్నారు. ఇప్పటికే ఈ దేశంలోని వేల మంది ప్రజల ప్రాణాలను ఉగ్రవాదులు హరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more