(Image source from: Pressmediaofindia.com)
నైజర్ దేశాధ్యక్షుడి ఎన్నికల తొలి విడత ఫలితాలు వెలువడుతున్న వేళ అ దేశంలో రక్తపేటేరులు పారాయి. ప్రతీకారేచ్చతో రగలిపోతున్న ఉగ్రవాద మూకలు రెండు గ్రామాలపై తెగబడి కనిపించిన వారందరినీ తుపాకీ తూటాలతో బలితీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపైగా ప్రజల ప్రాణాలను హరించారు. తమపై అనునిత్యం దౌర్జన్యం చేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను కొట్టి చంపడమే అక్కడి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఇద్దరు ఉగ్రవాదుల కోసం రెండు గ్రామాల ప్రజల ప్రాణాలను హరించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్ లో జరిగింది.
అయితే తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఆగడాలను భరించలేకపోయిన గ్రామస్థులు వారిని కొట్టి చంపారు. అయితే ఈ విషయం తెలిసుకున్న ఉగ్రవాద సంస్థ.. తమకు మద్దతుగా వున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు పాకిస్థాన్ కు చెందిన అల్ ఖైధా ఉగ్రవాద సంస్థల సహకారంతో అర్థరాత్రి ఊరంతా నిద్రిస్తున్న వేళ.. గ్రామంలోకి చొచ్చుకోట్టి.. కనపించినవారిపై తుపాకీ తూటాలను దింపారు. ఈ దారుణం గురించి స్థానిక అధికారుల ద్వారా సమాచారం అందుకున్న అ దేశ ప్రధాని బ్రిగి రఫిని.. బాధిత రెండు గ్రామాలైన టోంబాంగౌ, జారౌమ్ దారే లకు వెళ్లి అక్కడి పిరస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజర్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద మూకల దాడులలో హతులైన గ్రామ ప్రజలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాని, ప్రజలకు అండగా తాము వుంటామని ఈ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు నమ్మకం కలిగించేందుకు వచ్చామని అన్నారు. దేశాధ్యక్షుడు తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. తమతో పాటు యావత్ దేశం గ్రామ ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు, పశ్చిమాఫ్రియా సరిహద్దు గ్రామాలతో పాటు నైజర్ ప్రజలకు కూడా నిత్యం ఉగ్రవాద ప్రభావితానికి గురివుతూనే వున్నారు. ఇప్పటికే ఈ దేశంలోని వేల మంది ప్రజల ప్రాణాలను ఉగ్రవాదులు హరించారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది.... Read more
Mar 03 | రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవలంబిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వలసలు వస్తాయని వైసీపీ రాజ్యసభ... Read more
Mar 03 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలే వున్నారని అరోపణలు రావడంతో హత్య జరిగిన... Read more
Mar 03 | ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి... Read more
Mar 03 | ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో... Read more