(Image source from: Zee5.com)
కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నిర్వహించిన కరోనా వాక్సినేషన్ డ్రైరన్ తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తైంది. ఇందులో భాగంగా ముందుగా వైద్యయంత్రాన్ని సమాయత్తం చేసేంది. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ శనివారం నిర్వహించగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ పలు చోట్ల, ఉత్తర్ ప్రదేశ్ లోని ఐదు ప్రాంతాల్లో ఈ నెల ఐదున డ్రైరన్ కోనసాగనుంది, టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్ లో అధికారులు విస్తృతంగా పరిశీలించారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో 46 కేంద్రాల్లో ఈ డ్రైరన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో భాగంగా వాక్సీన్ తీసుకునే ప్రజలు అరోగ్య సిబ్బంది అనుసరించాల్సిన విధివిధానాలను మాక్ డ్రిల్ గా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 39 కేంద్రాలతో పాటు తెలంగాణలోని ఏడు కేంద్రాల్లో ఈ డ్రైరన్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కోనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని దు కేంద్రాల్లో గత నెల ఈ ప్రక్రియను నిర్వహించారు. కృష్ణ జిల్లాతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ కేంద్రాలకు డమ్మి లబ్దిదారులు వచ్చి కరోనా వాక్సీనేషన్ తీసుకునే ప్రక్రియతో పాటు వారి పేర్ల నుమోదు, ఆధార్ వివరాలు, చేతులను శానిటైజ్ చేసుకోవడం.. తరువాత అక్కడున్న క్యూలైన్లో ఆరు ఫీట్ల దూరంలో కూర్చోవడం.. ఆ తరువాత వాక్సీన్ తీసుకోవడం.. తరువాత అరగంట పాటు అక్కడి వార్డులో విశ్రాంతి తీసుకుని ఎలాంటి రియాక్షన్ లేదని నిర్థారించుకున్న తరువాత మరో దారిలో బయటలకు వెళ్లడంతో ప్రక్రియ ముగుస్తోంది.
ఇక ఇటు తెలంగాణలోనూ ఏడు కేంద్రాల్లో ఇవాళ ఉదయం డ్రైరన్ కొనసాగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నాలుగు కేంద్రాలతో పాటు మహబూబ్ నగర్ మూడు జిల్లాలో కేంద్రాల్లో ఈ డ్రైరన్ కొనసాగింది. హైదరాబాద్ తిలక్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నాంపల్లి ప్రాంతీయ సుపత్రి, గాంధీ ఆసుపత్రి సహా సోమాజిగూడులోని యశోధా అసుపత్రిలో ఈ డ్రైరన్ కొనసాగిది. ఇక మహబూబ్ నగర్లో ని జనాంపేట ప్రాథమిక అరోగ్య కేంద్రంతో పాటు జిల్లా ప్రభుత్వ జనరల్ అసుపత్రితో పాటు నేహా సన్ షైన్ అసుపత్రిలోనూ డ్రై రన్ కోనసాగుతోంది. ఈ ప్రక్రియ అంతా వ్యాక్సినేషన్ సమయంలో సజావుగా సాగేలా సిబ్బందికి అవగాహన కల్పించడం కోసమే ఈ డ్రైరన్ చేపట్టారు.
డ్రైరన్ కోనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని తిలక్ నగర్ ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన టీకా మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై స్వయంగా వెళ్లి పరిశీలించారు. టీకా ఇచ్చాక ఏవైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణం అందించాల్సిన చికిత్స గురించి డ్రైరన్ మాక్డ్రిల్ నిర్వహించిన విధానాన్ని కూడా అక్కడి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. టీకా లబ్ధిదారులు కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి నుంచి సమాచారాన్ని కొ-విన్ యాప్ లో ప్రవేశపెట్టడం తదితర అన్ని దశలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి అరోగ్యశాఖ అధికారులతో ఆమె చర్చించారు, ఈ ప్రక్రియ గురించి వారు గవర్నర్ కు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more