కరోనా మహమ్మారి విజృంభనతో భయాందోళనకు గురైన దేశవాసులలో టీకా వస్తుందన్న ఆశలు వారిలోని అంధోళనలను దూరం చేస్తున్నా.. ఈ టీకాలు ఎప్పటికి తమకు అందేను.. ఎప్పుడు తమలోని భయాలకు విముక్తి కలిగేనో అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనూ కరోనా బారిన పడి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు అసువులు బాస్తుండటంతో దేశ ప్రజల్లోనూ భయాందోళనలు కోనసాగుతున్నాయి. అయితే కరోనా ఉద్దృతి తగ్గిందని.. దీంతో ఇక లాక్ డౌన్ ముందు రోజుల మాదిరిగా పరిస్థితులు మారిపోయాయని, అన్ లాక్ 5.0 నుంచి సర్వసాధారణ స్థితికి చేరకున్నాయని ప్రజలు కూడా తమ కార్యకాలపాలను యధావిధిగా నిర్వహించుకుంటున్నారు.
అయితే కొందరు మాత్రం కరోనా నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకోగా, మరికొందరు మాత్రం ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండానే యధేశ్చగా సంచరిస్తూన్నారు, ఇలాంటి వారితో క్రమంగా దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య మళ్ల పెరిగే అవకాశాలు లేకపోలేదు. సరిగ్గా ఇక కరోనా మరికొద్ది రోజుల వ్యవధిలో దేశం నుంచి కనిపించకుండా పోతుందని.. గత కొన్న రోజులుగా కరోనా కేసులు ముపై వేలకు దిగవనే నమోదవుతన్న క్రమంలో చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేగింది. క్యాంపస్ లో 66 మంది స్టూడెంట్స్ సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకింది. కాగా క్యాంపెస్ లో మొత్తంగా 774 మంది విద్యార్థులు ఉన్నారని, దీంతో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ఐఐటీని మూసి వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఎవరి నుంచి కరోనా క్యాంపెస్ లోకి ప్రవేశించిందో తెలియదుగానీ, ఒకే రోజులో 32 మంది వైరస్ బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు, ఐఐటీలోని అన్ని విభాగాలు, లైబ్రరీని వెంటనే మూసివేస్తున్నామని, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని సూచించామని పేర్కొన్నారు. ఇక క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతికదూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సర్క్యులర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more