కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని దేశరాజధాని సింఘు, టిక్రీ శివార్లలో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి, ఇవాళ రైతులు నిరాహారదీక్షలకు పిలుపునివ్వడంతో ఉదయం ఎనమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారు ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్షలు చేపట్టారు, వీరికి మద్దతుగా దేశంలోని పలు ప్రాంతాల రైతులు, రైతు సంక్షేమం కాంక్షించే నేతలు కూడా సంఘీభావ నిరాహారదీక్షలకు పూనుకున్నారు. అటు పంజాబ్, హరియాణాలలో రైతు సంఘాలు కమీషనరేట్ కార్యాలయాలను ముట్టడించాయి,
ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ సమాజ్ వాదీ పార్టీ నేతలు రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో దీక్షలకు పూనుకున్నారు. ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దులోని ఘజీపూర్ రహదారిపై భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ సహా ఇతర నాయకులు, రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అటు హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద కూడా అన్నదాతల నిరశన దీక్ష కొనసాగుతోంది. అటు హస్తినతో పాటు ఇటు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలకు రైతు సంఘాలు పిలుపునివ్వగా దాదాపుగా దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఈ పిలుపుకు స్పందించి నిరసన దీక్షలను నిర్విహిస్తున్నాయి,
అటు దేశరాజధాని ఢిల్లీలోనూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు మద్దతుగా ఇవాళ దీక్షను చేపట్టారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ సహా పలువురు ఎమ్మెల్యేలు రైతులకు సంఘీభావ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పోరేట్ దోపిడికి తెరలేస్తుందని, ఇక ఆహారధాన్యాలు, కూరగాయల ధరలు పెరగడంతో దేశంలో ద్రవ్యోల్భణం పతాకస్థాయికి చేరకుంటుందని అభిప్రాయపడ్డారు, అటు పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో రైతులు కమీషనర్ కార్యాలయాల ఎదుట దర్నా నిర్వహించారు.
ఇదే సమయంలో అప్ నేత, అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులను జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్న వారిని దేశద్రోహులని, వారు తక్షణం దేశం విడిచి పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు, తమకు అన్యాయం ఎక్కడ జరుగుతుందోనని, దేశప్రజలకు ఇక ఆకలికి ఎలా అలమటించిపోతారోనన్న అందోళనలో నిరసన దీక్షలకు దిగిన రైతులను పలువురు జాతివ్యతిరేకులని ముద్రవేస్తున్నారని అక్రోశాన్ని వెళ్లగక్కారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను జాతివ్యతిరేకిగా ముద్రవేస్తారా.? అని ఆయన ప్రశ్నించారు, ఇలాంటివారికి దేశంలో స్థానం లేదని విమర్శించారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more