మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్కు రోజు రోజుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఈనెల ప్రారంభం నుంచి రోజుకు ప్రయాణికుల సంఖ్య 1.70లక్షలు దాటుతుందని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. సువర్ణ ఆఫర్ ప్రవేశపెట్టిన తరువాత 20శాతం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశంలో ఎనిమిది నగరాల్లో మెట్రో సేవలందిస్తుండగా, అందులో నాణ్యమైన సేవలందించడంతో రెండోస్దానం హైదరాబాద్ మెట్రో దక్కించుకుంది. దీంతో అధికారులు ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు కొత్త ఆఫర్లు తీసుకొస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇతర వాహనాల్లో వెళ్లితే వైరస్ సోకే ప్రమాదముందని భావిస్తూ మెట్రో వైపు గమ్యస్దానాలకు చేరుకుంటున్నారు.
మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 360 ట్రిప్పులు సర్వీసు తిరగడంతో స్టేషన్కు వెళ్లిన రైలు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రెండు నెలలపాటు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న భరత్నగర్, ముషీరాబాద్, గాంధీ ఆసుప్రతి స్టేషన్లు తెరవడంతో ఈస్టేషన్ల నుంచి రోజుకు 4వేల మంది వెళ్లతున్నట్లు మెట్రో ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రారంభంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రైన్లు నడిచేవి, గత వారం రోజుల నుంచి రైళ్ల వేళ్లలో మార్పులు చేస్తూ ఉదయం 6.30గంటలకు మొదటి రైలు ప్రారంభిస్తున్నారు. రాత్రి 9.30గంటలకు చివరి రైలు బయలుదేరి ఆఖరి స్టేషన్కు రాత్రి 10.30 చేరుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈమార్పుతో మరో 5వేలు మంది ప్రయాణిలకు సంఖ్య పెరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు.
ప్రయాణికుల సంఖ్య రెట్టింపుతో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన గార్డెన్ ఫెస్టివల్లో మెట్రో ఐదు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు గెలుచుకుంది. త్వరలో మిగతా స్టేషన్ల పరిధిలోని ఖాళీ స్దలాల్లో పచ్చిక బయళ్లను అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రయాణికులు ఎక్కువగా ఎల్బీనగర్, దిల్షుక్నగర్,ఎంజిబిఎస్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి,మియాపూర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఆర్టీసీ క్రాస్రోడ్, నారాయణగూడ స్టేషన్లు నుంచి ప్రయానిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. సాప్ట్వేర్ కంపెనీల సేవలు ప్రారంభమైతే మరో 60వేలు మంది పెరగవచ్చంటున్నారు. లాక్డౌన్ తరువాత నెలరోజుల వరకు మెట్రో పుంజుకోలేదని,ఆర్టీసీ బస్సులు ప్రారంభమైన తరువాత మెట్రో వైపు జనం మొగ్గు చూపారని వెల్లడిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more