(Image source from: Thehansindia.com)
ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట జంక్షన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పిపోయింది. ఓ పశువుల కాపరి తాను గాయపడి., ఆ మార్గం గుండా వచ్చే రైళ్లకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చేసింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు భారీ విస్పోటనంతో సంభవించిన పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడి పోలీసులకు సమాచారాన్ని అందించారు. రేణిగుంట పోలీసులు, రైల్వే పోలీసులు, బాంబు స్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి బాంబు పేలుడులో వినియోగించిన పధార్థాలను పరిశీలిస్తున్నారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రేణిగుంట సిఐ అంజు యాదవ్.. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు ఆయన తెలిపిన కథనం ప్రకారం.. రేణిగుంట రైల్వే ట్రాకుపై ఓ నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లోని స్థానిక తారకరామా నగర్ కాలనీలో నివసించే శశికళ అనే మహిళ నిత్యం మాధిరిగానే ఇవాళ కూడా పశువులను మేపడానికి వచ్చింది. అలా మేపుతూ రాగా ఓ చోట అమె ఓ డబ్బాను గుర్తించింది. అయితే డబ్బాను చూసినా దానిని చేతులతో తీసే ధైర్యం చేయని శశికళ.. తన చేతిలో ఉన్న కర్రతో ముందుగా ఆ డబ్బాను కదిలించింది.
అంతే భారీ శబ్ధంతో పెద్ద విస్పోటనం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో శశికళ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న జిఆర్ పి, పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాన్ని పరీక్ష నిమిత్తం పంపామని నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more