(Image source from: V6velugu.com)
భారతీయ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ ఎస్బీఐ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లుగా ఉన్న నగదు ఉపసంహరణ పరిమితిని తాజాగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లు అన్ని రకాల డెబిట్ కార్టుదారులను ఒకే గాడికి కట్టేసినట్టుగా ఒకే విధమైన నగదు ఉపసంహరణ పరిమితిని విధించిన బ్యాంకింగ్ దిగ్గజం తాజాగా డెబిట్ కార్డుల రకాన్ని బట్టి పరిమితులను విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో బ్యాంకు జారీ చేసే డెబిట్ కార్డులపై ఇన్నాళ్లు దృష్టి సారించని ఖాతాదారులు ఇకపై వాటిపై కూడా దృష్టి సారించేలా చేసింది.
సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ హల్టర్లతో పాటు శాలరీ అకౌంట్ ఖాతారులకు.. వీరితో పాటు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఖాతాదారులకు బ్యాంకు క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులనే జారీ చేసింది. అయితే బ్యాంకు అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదని చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అధికారులు తాజాగా అన్ని డెబిట్ కార్డుదారులకు నగదు ఉపసంహరణ పరమితిని పెంచామని చెబుతున్నా అది వీరికి మాత్రం వర్తించది తెలుస్తోంది. వీరికి మునుపటి మాదిరిగానే రూ.20 వేల వరకు మాత్రమే నగదు విత్ డ్రా పరిమితి ఉంది.
అయితే మిగతా డెబిట్ కార్డుదారులకు మాత్రం ఎస్బీఐ తాజా ప్రకటనలో లబ్ది చేకూరింది. గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు నుంచి ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు వరకు నగదు ఉపసంహరణ పరిమితి ఏకంగా రూ. 20 వేల నుంచి లక్ష వరకు పొగడించింది. ఇక ప్రతీ ఎస్బీఐ డెబిట్ కార్డు యూజర్ కు బ్యాంకు మరో లబ్దిని చేకూర్చింది. ఇదివరకు నెల రోజుల వ్యవధిలో కేవలం ఐదు పర్యాయాలు మాత్రమే ఏటీయం కేంద్రాల నుంచి ఉచిత లావాదేవీలు జరుపుకునే పరిమితిని జులై 1 నుంచి ఎనమిది సార్లకు పొడగించింది. ఈ పరిమితి మించితే చార్జీల వడ్డన తప్పదు.
కాగా ఇదివరకు పరిమిత మేర ఏటీయం కేంద్రాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే ఖాతాదారులు ఇకపై మాత్రం ఏటీయం కేంద్రాల నుంచి రూ. పది వేలకు మించిన మొత్తంలో డబ్బును విత్ డ్రా చేస్తే.. తప్పక ఓటీపీలను ఎంటర్ చేయాల్సిందే. పది వేలకు మించి నగదు విత్ డ్రా చేయాలనుకుంటున్న ఖాతాదారు రిజిస్టర్ మొబైట్ కు బ్యాంకు ఓటీపిని పంపిస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే డబ్బు విత్ డ్రా అవుతుంది. తొలుతు ఖాతాదారులు భద్రత నేపథ్యంలో రాత్రి పూట మాత్రమే అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ఇక సెప్టెంబర్ 18 నుంచి ప్రతినిత్యం అమల్లోకి వచ్చింది.
* క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేల వరకు
* గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు
* ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు
* ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు
* మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు
* గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు
* ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more