దుబ్బాక ఉపఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్దమయ్యేలా వుందని ఆ పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే అర్థమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి విజయశాంతి అన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రావని ముందస్తుగానే మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయని అమె అనుమానాలు వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలను సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లో లెక్కించనున్నారా.? అని అమె ప్రశ్నించారు. రామలింగారెడ్డిని ఓడించిన చరిత్ర చెరుకు ముత్యంరెడ్డికి వున్నదన్న విషయాన్ని మర్చిపోరాదని అమె హితవు పలికారు.
హరిశ్ రావు వ్యాఖ్యలను బట్టి ఎన్నికలకు ముందే ఫలితాలెలా ఉండాలో టీఆర్ఎస్ నిర్ణయించిందనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. అయితే ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతల మాయమాటలకు లోంగి ఓట్లు వేసి ఓటర్లకు అధికార పార్టీ అరాచకాలపై ఉప ఎన్నికలలో కావాల్సినంత స్పష్టత వచ్చిందని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో జరిగే ఉపఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా హరీశ్ రావుకు హైరానా ఎందుకో ఎవరికీ అంతు చిక్కడంలేదని అన్నారు. సానుభూతి ఓట్లతో ఈజీగా గెలవాల్సిన చోట ఎందుకు అంతలా శ్రమిస్తున్నారని ప్రశ్నించారు.
దుబ్బాక గెలుపోటములతో.. ఓట్ల శాతంతో ఆయన మంత్రి పదవికి లింకు ఏర్పడిందని ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోందని అమె అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే... దాని ప్రభావం హరీశ్ మంత్రి పదవి మీద పడుతుందని కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అనే చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పారు. ఈ కారణం వల్లే ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ కరోనాను ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓటర్లు అనుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more