మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బ్రెయిన్ లో ఏర్పడిన క్లాట్ ను తొలగించే విషయమై వైద్యులు చేసిన శస్త్రచికిత్స నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా ఆందోళనకరంగా మారింది. ఆ తరువాత ఆయన కోమాలోకి జారుకున్నారు. దీంతో ఆయనకు వెంటిలేటర్ ను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నామని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, దీనికి తోడు ఆయనకు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని కూడా నిర్థారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు.
ప్రణబ్ ముఖర్జీ మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆయనకు క్లిష్టమైన ఆపరేషన్ చేశామని అసుపత్రివర్గాలు వెల్లడించాయి, చికిత్స తరువాత కూడా ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనబడటం లేదని ఇంకా ఆయన కోమాలోనే వున్నారని వైద్యులు తెలిపారు. ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆర్మీ ఆసుపత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ ఇవాళ ఉదయానికి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆయన ఇంకా కోమాలోనే వున్నారు. ఆయితే ఆయన శరీరంలోని కీలకమైన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్సను అందిస్తున్నాం’’ అని ఆర్మీ రీసెర్చ్, రిఫరల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇక తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, తనను గత వారం రోజులుగా కలసిన వారందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్ లో వుండాలని ఆయన కోరారు. ఈమేరకు ఆయన గత శనివారం రోజున ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తన తండ్రి ఆరోగ్యంపై వస్తోన్న వార్తలు అబద్దమని ఆయన తనయ శరిష్ట్మా ముఖర్జీ వెల్లడించారు. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసమే తన ఫోన్ ను ఆన్ లో వుంచానని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ఇదివరకే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more