Pranab Mukherjees Condition Unchanged: Hospital అందొళనకరంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Pranab mukherjees condition unchanged on ventilator support hospital

Pranab Mukherjee, Ventilator, health condition, former president, Army Research and Referral Hospital, brain surgery, COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, India coronavirus cases

'The condition of Hon'ble Shri Pranab Mukherjee remains unchanged this morning. He is deeply comatose with stable vital parameters and he continues to be on ventilatory support,' said a statement from the Army Research and Referral hospital.

కోమాలోకి మాజీ రాష్ట్రపతి.. అందొళనకరంగానే ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Posted: 08/13/2020 01:42 PM IST
Pranab mukherjees condition unchanged on ventilator support hospital

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బ్రెయిన్ లో ఏర్పడిన క్లాట్ ను తొలగించే విషయమై వైద్యులు చేసిన శస్త్రచికిత్స నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా ఆందోళనకరంగా మారింది. ఆ తరువాత ఆయన కోమాలోకి జారుకున్నారు. దీంతో ఆయనకు వెంటిలేటర్ ను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నామని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, దీనికి తోడు ఆయనకు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని కూడా నిర్థారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్‌ ఆరోగ్యంపై గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆయనకు క్లిష్టమైన ఆపరేషన్ చేశామని అసుపత్రివర్గాలు వెల్లడించాయి, చికిత్స తరువాత కూడా ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనబడటం లేదని ఇంకా ఆయన కోమాలోనే వున్నారని వైద్యులు తెలిపారు. ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆర్మీ ఆసుపత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ ఇవాళ ఉదయానికి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆయన ఇంకా కోమాలోనే వున్నారు. ఆయితే ఆయన శరీరంలోని కీలకమైన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్సను అందిస్తున్నాం’’ అని ఆర్మీ రీసెర్చ్, రిఫరల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇక తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, తనను గత వారం రోజులుగా కలసిన వారందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్ లో వుండాలని ఆయన కోరారు. ఈమేరకు ఆయన గత శనివారం రోజున ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తన తండ్రి ఆరోగ్యంపై వస్తోన్న వార్తలు అబద్దమని ఆయన తనయ శరిష్ట్మా ముఖర్జీ వెల్లడించారు. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసమే తన ఫోన్ ను ఆన్ లో వుంచానని తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ఇదివరకే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles