Sarvadarshan tokens at Tirumala from today శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. టికెట్లు రెట్టింపు

Ttd doubles darshan numbers to 12000 daily

coronavirus, covid-19, ttd, Tirumala Tirupati Devasthanams, Lord Venkateswara temple, Tirumala, Sarvadarshan tokens, TTD, Tirumala temple, Sarvadarshan tickets sale, Tirupati, sarva darshan system, footfall, doubles, Devotees, TTD additional EO AV Dharma Reddy, COVID-19 cases, Andhra pradesh

The rising number of Covid-19 cases in Tirupati has not deterred the Tirumala Tirupati Devasthanams from increasing the pilgrim footfall at the Lord Venkateswara temple in Tirumala, which remains a green zone. The TTD on Thursday announced that it would now allow 12,000 devotees per day into the temple. Speaking to TOI, TTD additional EO AV Dharma Reddy said after an initial trial run of nearly 17 days

శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. టికెట్లు రెట్టింపు

Posted: 06/26/2020 06:09 PM IST
Ttd doubles darshan numbers to 12000 daily

కరోనా మహమ్మారి జడలు విప్పి కళరా నృత్యం చేస్తున్న నేపథ్యంలో దాదాపు ఎనబై రోజుల తరువాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారాలు తెరుచుకోవడంతో భక్తుల దర్శనానికి బారులు తీరుతున్నారు. రోజు రోజుకూ శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తిరుమల తరుపతి దేవస్థానం కూడా అందుకు అనుగూణంగా నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ద్వారాలు తెరచిన క్రమంలో కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ రోజుకు కేవలం ఆరు వేల మందిని మాత్రమే దర్శనాలకు అనుమస్తామని టీటీడీ ప్రకటించింది. కాగా భక్తుల రద్దీ అధికం అవడంతో టీటీడీ క్రితం రోజున ఆన్ లైన్ లో ఏకంగా 18 వేల టికెట్లను విక్రయించింది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరమేంటంటే ఆరు వేల నుంచి 12 వేలకు పెంచిన టికెట్లను మరోమారు పెంచి ఏకంగా 18 వేలను విక్రయించినా.. అవి కాస్తా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే అయిపోయాయి. తిరుమలలో ఈ నెల 27న శ్రీవారి దర్శనానికి అఫ్ లైన్ లో సర్వదర్శనం టికెట్ల జారీ చేస్తున్నారు. ఈ టికెట్లకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ మేరకు ఉచితదర్శన టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం ఉచిత టోకెన్ల జారీ తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ప్రారంభమైంది. అయితే టికెట్లను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

ఇందుకోసం ఏకంగా అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. రోజుకు 6750 మంది భక్తులకు  శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని తితిదే నిర్ణయించినా భక్తులు మాత్రం శ్రీవారి దర్శనాభాగ్యం లభిస్తందో లేదోనని పోటెత్తారు. ఈమేరకు ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే శుక్రవారం ఉదయం ప్రారంభించింది. తిరుపతిలోని విష్ణునివాసంలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో  6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు.  మొత్తం 18 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  ttd  sarva darshan system  footfall  doubles  Devotees  COVID-19 cases  Andhra pradesh  

Other Articles