తెలంగాణలో కరోనా పరిక్షల నిర్వహణలో విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. తెలంగాణ సర్కార్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శతో సతమతం అవుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. తమ అదేశాలను పాటించని పక్షంలో కోర్టు ధిక్కారం కింద కేసులు నమోదు చేస్తామని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులో తెలంగాణ ప్రభుత్వానికి కాసింత ఊరట లభించింనట్లు అయ్యింది. సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్వర్వులపై స్టే విధించింది.
కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో మరణించిన వారికీ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలన్న దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం సర్కార్ వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. హైకోర్టు ఆదేశించినట్లు అందరికీ కరోనా పరీక్షలు సాధ్యపడదని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
వైద్యులు, సిబ్బందికి వేతనాలపై కేంద్రానికి సుప్రీం అదేశం
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి వేతనాల చెల్లింపుపై రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వీరికి క్వారంటైన్ వసతులు కల్పించడంపై కూడా రాష్ట్రాలకు సూచనలు చేయాలని కోరింది. కోర్టు ఆదేశాల అమలుపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమలుపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వైద్యులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదన్న కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఆర్.షా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more