తమిళనాడులోని వెల్లూరులో దారుణం జరిగింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, కోరిక తీర్చాలని ఇరుగుపోరుగుకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు వేధించడంతో మనస్తాపానికి గురైన మైనర్ బాలిక.. అవమానం భరించలేక ఒంటికి నిప్పంటించుకుంది. ఈ దారుణ ఘటనలో బాలిక తీవ్రగాయాలపాలైంది. వెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 90శాతం కాలిన గాయాలతో జీనర్మణరాల మధ్య కోట్టుమిట్టాడుతోంది. డాక్టర్లు బాలికకు చికిత్స అందిస్తున్న.. అమె పరిస్థితి మాత్రం విషమంగా ఉందని, బతకడం కష్టం అని చెప్పారు. బాత్ రూమ్ లో అమె స్నానం చేస్తుండగా వీడియో తీసింది బాలిక ఇంటి పక్కనే వుండే పోరుగు కుర్రాళ్లే కావడం గమనార్హం. కాగా నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని వెల్లూరు పరిధిలో నివసిస్తున్న ఓ 15 ఏళ్ల మైనర్ బాలిక ఓ రోజు బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఇంటి పక్కన ఉండే ముగ్గురు కుర్రాళ్లు రహస్యంగా వీడియో తీశారు. తనతో నిత్యం సన్నిహితంగా వుండే కుర్రాళ్లు అమెకు ఒక్కసారిగా ఆ వీడియో చూపించి తమ కోరిక తీర్చాలని కోరారు. అమెను బ్లాక్ మెయిల్ చేశారు. తమ కోరికను తీర్చని పక్షంలో ఆ వీడియోను నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. రోజురోజుకి వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక భయపడింది. ఏం చేయాలో తెలియక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కిరోసిన్ ను తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకుంది.
చుట్టుపక్కల వారు వెంటనే వచ్చి.. మంటలు ఆర్పి బాలికను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు వెంటనే ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఒకడు మైనర్(17) యువకుడు కాగా మరో ఇద్దరు మేజర్లు. నిందితులు ఆకాష్ (19), గణపతి (22)తో పాటు మైనర్ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కి తరలించారు. కాలేజీలు విద్యార్థులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా లేని పక్షంలో.. వారిని ఓ కంట కనిపెట్టని తరుణంలో ఇలాంటి దారుణాలే జరుగుతాయని పోలీసులు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more