లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ధరల కుదుపులు లేని ఇంధన ధరలు.. అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చిన వెంటనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పదిరోజుల నుంచి వరుసగా ప్రతీ రోజు పెరుగుతున్న ఇంధన ధరలను వెంటనే ఉపసంహరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపుపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె పెట్రో ధరలను వెంటనే తగ్గించి సామాన్యులకు అంతర్జాతీయంగా అందే లబ్దిని అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్రమోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం నిర్వహిస్తున్న రోజునే లేఖ రాశారు.
అంతర్జాతీయంగా ప్రస్తుతం చరిత్రలో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరలో క్రూడ్ అయిల్ ధర పలుకుతుండగా, ఆ లబ్దిని ప్రజలకు అందించకుండా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలను ఇబ్బడిముబ్బడిగా విధిస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టాలలో వున్న వాహనదారులకు ఇంధన ధర లాభాలను అందకుండా మధ్యలోనే అటు ప్రభుత్వం, ఇటు ఇంధన సంస్థలు, వీటితో పాటు రాష్ట్రాలు తన్నకుపోవడం అసమంజసంగా పేర్కోన్నారు9. కరోనాతో కష్టకాలాన్ని వెల్లదీస్తున్న వాహనదారులకు లాభాలను అందించకుండా క్రమంగా పెంచడం పూర్తిగా అవివేకం, అనాలోచిత చర్య అని సోనియాగాంధీ విమర్శించారు.
సంక్షోభ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులపై ఈ భారం మోపడం సరికాదని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం కేవలం ప్రధాని నరేంద్రమోడీకి మాత్రమే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. కష్టకాలంలో వున్న ప్రజలకు భరోసా కల్పించేందుకు వారి ఖాతాల్లోకి డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. అవే ఈ కష్టకాలంలో వారికి అసరా అవుతాయని అన్నారు. ఇక ప్రభుత్వం ఈ పరిస్థితుల్లోనూ ప్రజల నుంచి లాభాన్ని ఆర్జించాలని అనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇంధర ధరల పెంపుపై మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని అత్యంత సంపన్నులకు చేకూర్చేు లబ్ది కోసం సామాన్య వాహనదారులపై ఇంధన భారం మోపుతుందని దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more