దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా విజృంభన కోనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరువాత ఎవరైనా హస్తినలోనూ మహమ్మారి వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. దీని వ్యాప్తి బారిన తాజాగా ఢిల్లీఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ పడ్డారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అధికారులతో పంచుకున్నారు. నిన్న రాత్రి తాను తీవ్రజ్వరం,. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోన్నాడు, అయితే అవి కరోనా వైరస్ లక్షణాలుగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన హుటాహుటిన తూర్పు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు.
సోమవారం రాత్రి తాను స్థానిక ఆసుపత్రిలో చేరానని, ఆయన ఇవాళ ఉదయం తన పాలోవర్స్ తో విషయాన్ని పంచుకున్నారు. తనకు రాత్రి హై గ్రేడ్ జ్వరం, ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవడంతో..ఆసుపత్రిలో చేరారని పోస్టులో పెట్టారు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో హోం క్వారంటైన్ కు వెళ్లారు. తన ఇంట్లోనే ఆయన వుంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అయితే ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలు ఫలితాల్లో కరోనా నెటిగివ్ గా రావడంతో ఆయన అభిమానులు, పార్టీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Due to high grade fever and a sudden drop of my oxygen levels last night I have been admitted to RGSSH. Will keep everyone updated
— Satyendar Jain (@SatyendarJain) June 16, 2020
ఇదే సమయంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ఆ పార్టీలోని ఇతర నేతల్లో టెన్షన్ పడుతున్నారు. ఇక ఆయనతో పాటు కరోనా మహమ్మారిపై సమీక్షలకు హాజరైన రాష్ట్ర వైద్యశాఖ అధికారులు కూడా అందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయం వారిలో నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారు హోం క్వారంటైన్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా.? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. కాగా ఆసుపత్రిలో చేరిన మంత్రికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సత్యేంద్ర జైన్ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దీనికి సీఎం కేజ్రీవాల్, ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు. వీరంతా జైన్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more