పీకల వరకు మద్యం సేవించిన ఓ మందుబాబు చేసిన వ్యవహారంతో తన కెరీర్ లో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త కేసును వైద్యులు చూసి షాక్ అయ్యారు. తన తాగుబోతు వేశాలతో.. ఔరా.. అని వైద్యులను కూడా నోరెళ్లబెట్టేట్లు చేశాడో మందుబాబు. అసలేం జరిగిందంటే తమిళనాడులోని నాగపట్టణం ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 27న ఓ మందుబాబు వచ్చాడు. కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్లకు చెప్పాడు. దీంతో అతనికి పరీక్షలు చేయించిన డాక్టర్లు.. అతని ఎక్స్ రే చూసి షాక్ కు గురయ్యారు. ఇదెలా సాధ్యం.. మనిషి కడుపులో ఏకంగా క్వార్టర్ గాజుసీసా ఎలా వెళ్లిందని అవ్వకయ్యారు.
దీంతో 29 ఏళ్ల బాధితుడి వద్దకు చేరుకుని అసలు నీ కడుపులోకి నోప్పి ఎప్పట్నించీ అంటూ ఆరా తీశారు. నీ కడుపులోకి 180 మి.లీ. మందు సీసా వుంది. అదెలా వెళ్లిందని ప్రశ్నించారు. దీంతో బాధితుడు తనకు జరిగిన విషయాన్ని డాక్లర్ల ముందు బయటపెట్టాడు. 27వ తేదీన పీకల వరకు మధ్యం తాగాని వ్యక్తి.. తన తనతో పాటు ఇంటికి కూడా ఓ మద్యం సీసాను తీసుకుని వెళ్లాడు. అది చూస్తే ఇంట్లో వాళ్లు దానిని దాచేస్తారనో.. లేక పగలగొడతారనో భావించిన మందుబాబు.. దానిని ఎక్కడ స్థలం లేనట్టుగా.. తన పురీషనాళంలో దాచేశాడు.
అది కొద్దికొద్దిగా లోపలికి వెళ్లింది. ఇంట్లోకి చేరుకున్న తరువాత బహిర్భూమికని టాయ్ లెట్ లోకి వెళ్లిన ఆయన.. దానిని తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అది కొద్దికొద్దిగా లోపలికి వెళ్లింది. మద్యం సీసాను బయటకు తీసే తన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో ఇంట్లో వారికి కూడా చెప్పలేదు. ఇక స్నేహితులకు చెప్పినా తనను హేళన చేస్తారని భావించి నేరుగా నాగపట్టణం జిల్లా అసుపత్రికి వచ్చాడు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించిన అనంతరం బాధితుడికి మత్తమందు ఇచ్చి.. సర్జరీ చేసి మద్యం బాటిల్ ను బయటకు తీశారు.
అయితే ఈ క్రమంలో లేదా రోగి ప్రయత్నించే సమయంలో సీసా పగిలివుంటే చాలా ప్రయాసతో కూడిన శస్త్రచికిత్స అవసరమయ్యేదని డాక్టర్లు తెలపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ సర్జన్ పాండియరాజ్ మాట్లాడుతూ, ఎక్స్ రే చూసి షాకయ్యామని చెప్పారు. తన కెరీర్ లో ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని అన్నారు. పొరపాటున సీసా పగిలి ఉంటే అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం రోగి కొంత బాధతో వున్నాడని, అయితే అతని అరోగ్యం నిలకడగానే వుందని, త్వరలో కోలుకుంటాడని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more