దేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన 4జీ సర్వీసులు కూడా అధునీకరించబడుతున్న రోజలివి. ఇక త్వరలోనే 4జీ టెక్నాలజీ పోయి 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే సోషల్ స్టేటస్ సింబల్ అన్న నానుడి పోయి మినిమమ్ కమాండిటీగా మారిపోయింది. దేశంలోని కూలీల నుంచి రైతుల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో ఏకంగా 130 కోట్ల మందిలో ఏకంగా 30 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో ఫోన్ నెంబర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
మొబైల్ ఫోన్ నెంబర్లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులో్కి మరిన్ని ఫోన్ సర్వీసులు తీసుకువచ్చేందుకు పది అంకెల మొబైల్ నెంబర్ ఇకపై 11 నెంబర్లుగా మారుతుందని వార్తలు వినిపించాయి. ఈ మేరకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పలు సూచనలు చేసిందని కూడా వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రమైనా మొబైల్ ఫోన్ నెంబరుకు వుంటే అంకెలు మాత్రం కేవలం 10 మాత్రమే. అయితే ఈ విషయంలో తాజాగా ట్రామ్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై కూడా మొబైల్ ఫోన్ నెంబర్లకు కేవలం పది అంకెలు మాత్రమే వుంటాయని చెప్పింది.
ప్రస్తుతం వున్న నెంబర్లు ఇకపై కూడా కంటిన్యూ అవుతాయి. ఇక నుంచి మన దేశంలో విడుదల చేయబోయే ఫోన్ నంబర్ల సంఖ్యను 11కు పెంచుతున్నట్టు వచ్చిన వార్తలను ట్రాయ్ ఖండించింది. 10-అంకెల నెంబర్ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 'మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. దేశంలో 10-అంకెల నెంబర్ విధానం కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్కు మార్చబడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తున్నాం' అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more