రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహరాంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన తరుణంోల ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోనున్నారు, ఇందుకు ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ పరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపిన నిమ్మగడ్డ.. కోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపట్లోనే తాను తిరిగి విధుల్లోకి చేరుతున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. హైకోర్టు తీర్పుతోనే తాను విధుల్లోకి చేరుతున్నానని అన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని ఆయన అన్నారు. దీంతో ప్రస్తుత ఎస్ఈసీ గా బాద్యతలు నిర్వహిస్తున్న మాజీ న్యాయమూర్తి కనగరాజ్ రాజీనామా చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు న్యాయపోరాటంపై సానుకూల తీర్పు రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు. ‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింద‘ని అన్నారు, ‘అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అని జనసేనాని వ్యాఖ్యానించారు.
ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ హైకోర్టు ప్రజల్లో నమ్మకాన్ని నింపిందని అంటున్నారు. వైసీపీ సర్కారు ఇకనైనా తన తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పందిస్తూ.. 'భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్.. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది' అని ట్వీట్ చేశారు.
ఎస్ఈసీపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. హైకోర్టు రాజ్యాంగ విలువలను కాపాడిందన్నారు. కోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లదని భావిస్తున్నామని బుచ్చయ్య చౌదరి తెలిపారు. కాగా ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై వైఎస్ జగన్ సర్కార్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేయనుందని సమాచారం. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more