ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను తొలగిస్తూ రాష్ట్రంలోని జగన్ సర్కార్ జారీ చేసిన జీవో చెల్లదని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. దీంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజన్ నియామకం, పదవీకాలం సహా పలు నిబంధనలు మారుస్తూ జారీ చేసి ఆర్డినెన్స్ ను కూడా న్యాయస్థానం కొట్టేసింది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్, జీవో జారీలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించి.. మాజీ ఐఏఎస్ లను కాకుండా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించేలా నిబంధనలు మార్చుతూ తీసుకువచ్చిన జీవోలను కొట్టివేసింది. దీంతో ఇప్పటి వరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డకు పదవీ కాలం మూడేళ్లు పూర్తయిందంటూ జగన్ సర్కారు ఆయన్ని తొలగిస్తూ జీవో జారీ చేసింది. కొత్త రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించిన విషయం తెలిసిందే. ఆయన రాష్ట్ర ఎస్ఈసీగా పదవీ బాద్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో కోనసాగాల్సిన స్థానిక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలను రమేష్ కుమార్ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వాయిదా వేయడంతో ప్రభుత్వం తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని రమేష్ కుమార్ ఆరోపించారు. తనను పదవి నుంచి తొలగించిందని అన్నారు. దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేశారు. ఈ పిటీషన పై విచారించిన న్యాయస్థానం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని తీర్పును వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 213 ప్రకారం ఆ ఆర్డినెన్స్ చెల్లదని పేర్కొంది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more