దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజల ప్రాణాలను హరించిన ఈ వైరస్.. భారత్ లో తన సంక్రమణ శక్తిని తగ్గించుకున్నా.. ప్రభావాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే వుంది. దేశవ్యాప్తంగా తొలిసారి అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడం అది కూడా ఏడున్నర వేలకు చేరలో నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన మరణాలతో భారత్ ఏకంగా చైనాను మించిన మరణాలను నమోదు చేసుకుంది. దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏడు వేలకు పైబడి కేసులు నమోదు కావడం కూడా కలవరం రేపుతోంది.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 7466 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,65,799 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 175 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4706కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో పదవ స్థానంలో కోనసాగుతున్న భారత్జ.. టర్కీ దేశాన్ని అధిగమించి తొమ్మదవ స్థానానికి ఎగబాకింది. ఇక మరణాల్లోనూ భారత్ చనాను మించిన సంఖ్యకు చేరుకోవడంతో అందోళన వ్యక్తం అవుతోంది. చైనాలో 4634 మరణాలు సంభవించగా,. భారత్ లో 4706 మరణాలు నమోదు చేసుకున్నాయి.
ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 68,149 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 89,987 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2500 కేసులు నమోదయ్యాయి, ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే 1467 పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. దేశవ్యాప్తంగా లక్షా యాభై వేల కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో మాత్రమే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో కేసులు పెరగడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59546కు చేరగా, ఏకంగా 1982 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవవధిలో మహారాష్ట్రలో 85 మరణాలు సంభవించాయి.
ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 827 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 19372కు చేరగా, గడిచిన 24 గంటల్లో 12 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 16 వేల 281కు చేరగా, గడిచిన 24 గంటల్లో 13 మరణాలు సంభవించడంతో మొత్తంగా 316 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నమొత్తం కేసులు సంఖ్య 15,562కి చేరగా, ఏకంగా 942 మంది అసువులు బాసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more