కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా గళమెత్తిన డాక్డర్ సుధాకర్ తాజాగా ప్రభుత్వం తనపై మందులను ప్రయోగాన్ని చేస్తోందని దీంతో తాను సైకోగా మారే ప్రమాదముందని అనుమానాలను వ్యక్తం చేశారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అనెస్థీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని విశాఖ మానసిక వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తోంది.
ఈ క్రమంలో డాక్డర్ సుధాకర్ రావు తనపై మందుల ప్రయోగం చేస్తూ.. సైకోగా మర్చేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మానసిక ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ రాధారాణికి నాలుగు పేజీల లేఖ రాశారు. తనకు రోజు రాత్రివేళ ఇస్తున్న నాలుగు రకాల మాత్రలు.. ఒక ఇంజక్షన్ చేస్తున్నారని పేర్కోన్నారు. వీటితో తన పెదాలు తడి అరిపోతున్నాయని, కళ్లు కూడా మసకబారుతున్నాయని, ఆయాసం వస్తోందని, తల తిరుగుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కోన్నారు. పెదవులపై పుండ్లు అవుతున్నాయని, తనకు పలు రకాల మానసిక రోగాలకు సంబంధించిన మందులు ఇస్తున్నారని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే డాక్టర్ సుధకార్ మానసిక రుగ్మతకు సంబంధించిన మందులనే తాము ఇస్తున్నామని ఇందులో ఎలాంటి తప్పుడు డ్రగ్స్ లేవని.. వాటితో సుధాకర్ అరోగ్యానికి ఎలాంటి హాని వుండదని మానసిక ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ రాధారాణి తెలిపారు. అయితే ఎం మెడికేషన్ ఇస్తున్నామన్న విషయం బయటకు చెప్పకూడదని అన్నారు. అయితే ప్రతీరోజు డాక్యుమెంటేషన్ జరుగుతోందని.. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ వ్యవహరం న్యాయస్థానంలో వున్నందున్న.. రాష్ట్ర హైకోర్టు కోరిన పక్షంలో సుధాకర్ ఇస్తున్న మందుల వివరాల డాక్యుమెంటేషన్ ను సమర్పిస్తామని చెప్పారు. అయితే తన కొడుకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుదాకర్ తల్లి కావేరమ్మ డిమాండ్ చేశారు. తన కొడుకు వ్యవహరంపై హైకోర్టు సిబిఐ విచారణకు అదేశిస్తే.. దానిని ఎదుర్కోలేని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందంటేనే ఏదో కుట్ర జరుగుతుందన్న విషయం వ్యక్తమవుతుందని అమె అనుమానం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more