దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశవ్యాప్తంగా రెండో అత్యధిక మరణాలు సంభవించడం అందోళనకరంగా వుంది. గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే వంద మరణాలు సంభవించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ గడిచిన 24 గంటల వ్యవధిలో రమారమి 800 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఆరున్నర వేలకు పైబడి కేసులు నమోదు కావడం కూడా కలవరం రేపుతోంది.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 6500 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,58,333 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4531కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా 100 మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.
ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 67,692 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 86,110 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2190 కేసులు నమోదు కావడంతో పాటు 100 మంది మృత్యువాతపడ్డారు. గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. దేశవ్యాప్తంగా లక్షా యాభై వేల కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో మాత్రమే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో కేసులు పెరగడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 56948కు చేరగా, ఏకంగా 1897 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముబైలోనే ఏకంగా ముఫై వేల కేసులు నమోదు కావడం గమనార్హం.
ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 817 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 18545కు చేరగా, 133 మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 15 వేల 257కు చేరగా, 303 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నిన్న 374 కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 15,195కి చేరగా, ఏకంగా 938 మంది అసువులు బాసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more