Coronavirus: India: 158,086 Cases and 4,534 Deaths దేశంలో కరోనా విజృంభన.. ఒక్కరోజే 197 మరణాలు..

Coronavirus update covid 19 cases in india rise to 1 58 lakh death toll at 4 531

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The states across India reported over 6,500 new coronavirus cases in the last 24 hours. The total number of COVID-19 cases in India increased to 158,333 today. The number of deaths related to COVID-19 infection rose to 4,531. The states confirmed 194 deaths in last 24 hours, second highest in a single day.

దేశంలో గడిచిన 24గంటల్లో.. ఆరున్నర వేల కేసులు.. 197 మరణాలు

Posted: 05/28/2020 01:07 PM IST
Coronavirus update covid 19 cases in india rise to 1 58 lakh death toll at 4 531

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశవ్యాప్తంగా రెండో అత్యధిక మరణాలు సంభవించడం అందోళనకరంగా వుంది. గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే వంద మరణాలు సంభవించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ గడిచిన 24 గంటల వ్యవధిలో రమారమి 800 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఆరున్నర వేలకు పైబడి కేసులు నమోదు కావడం కూడా కలవరం రేపుతోంది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 6500 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,58,333 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4531కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా 100 మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 67,692 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 86,110 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2190 కేసులు నమోదు కావడంతో పాటు 100 మంది మృత్యువాతపడ్డారు. గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. దేశవ్యాప్తంగా లక్షా యాభై వేల కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో మాత్రమే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో కేసులు పెరగడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 56948కు చేరగా, ఏకంగా 1897 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముబైలోనే ఏకంగా ముఫై వేల కేసులు నమోదు కావడం గమనార్హం.

ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 817 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 18545కు చేరగా, 133 మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 15 వేల 257కు చేరగా, 303 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నిన్న 374 కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 15,195కి చేరగా, ఏకంగా 938 మంది అసువులు బాసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles