Covid-19 cases in Andhra Pradesh cross 1,500-mark ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు

Coronavirus latest updates covid 19 cases in andhra pradesh cross 1 500 mark

covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

As many as 62 out of 5,943 samples have tested positive for COVID-19 in Andhra Pradesh in the last 24 hours, taking the state's coronavirus tally to 1,525, said the command control room on Saturday.

ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు

Posted: 05/02/2020 12:34 PM IST
Coronavirus latest updates covid 19 cases in andhra pradesh cross 1 500 mark

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, గత వారం రోజులుగా ప్రతీ రోజు 60 నుంచి 70 పాజిటివ్ కేసుల వ్యాప్తి చెందుతూనే వుంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 5943 మందిని పరీశీలించగా కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యయి, శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15 వేల మార్కు దాటింది. తాజా గణంకాలతో లిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1525కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇక తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కర్నూలు, ఆ తరువాత కృష్ణా జిల్లాలు వున్నాయి. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 441 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25, కృష్ణలో 12 కేసులు, కడపలో నాలుగు, గుంటూరులో 2, అనంతపురంలో నాలుగు, తూర్పు గోదావరిలో 3, ప్రకాశంలో 1కటి, విశాఖపట్నంలో నాలుగు, పశ్చిమ గోదావరిలో ఒక్క కేసు నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా కరోనా కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. ఇక్కడ తాజా కేసులను కలిపితే ఏకంగా నాలుగు వందల మార్కు దాటింది. కర్నూలు జిల్లాలో 436 కేసులు నమోదు కాగా, 10 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 308 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 258 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-90 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, పశ్చిమగోదావరి-59, చిత్తూరు-80,  విశాఖపట్నం-29, కడప జిల్లాలో 83 కేసులు, అనంతపురం-71 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles