కరోనా కాటువేస్తున్న క్రమంలో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక అభివృద్ది చెందిన దేశాలు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇక మందులేని ఈ వైరస్ ను కట్టడి చేయడమెక్కటే మార్గమని అలోచించి చర్యలు తీసుకునే లోపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కరోనా వైరస్ ఉద్ధృతి ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 2,39,566 మంది మృత్యువాత పడ్డారు. 10,80,156 మంది కోలుకున్నారు.
ప్రధానంగా అమెరికాలో కరోనా విజృంభణ అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. ఈ అగ్రరాజ్యంలో 11,28,460 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 65,435 మంది మరణించారు. యూరప్ లోనూ ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. స్పెయిన్ లో 2,15,216 మందికి కరోనా నిర్ధారణ కాగా, 24,824 మంది మరణించారు. ఇటలీలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ పర్యాటక దేశంలో 2,07,428 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28,236 మంది ప్రాణాలు విడిచారు. బ్రిటన్ లో 1,77,454 పాజిటివ్ కేసులు, 27,510 మరణాలు నమోదు కాగా, జర్మనీలో 1,64,054 పాజిటివ్ కేసులు, 6,735 మరణాలు సంభవించాయి.
ఫ్రాన్స్ లో 1,30,185 పాజిటివ్ కేసులు, 24,594 మరణాలు నమోదయ్యాయి. టర్కీలో 1,22,392 పాజిటివ్ కేసులు, 3,258 మరణాలు, రష్యాలో 1,14,431 పాజిటివ్ కేసులు, 1,169 మరణాలు సంభవించాయి. ఇరాన్ లో 95,646 పాజిటివ్ కేసులు, 6,091 మరణాలు నమోదయ్యాయి. ఇక, భారత్ విషయానికొస్తే, 37,336 మందికి కరోనా నిర్ధారణ కాగా, 1218 మంది కన్నుమూశారు. అటు, కరోనాకు జన్మస్థానంగా నిలిచిన చైనాలో పరిస్థితి సద్దుమణిగింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more