Coronavirus: India struggles to find emerging hotspots దేశవ్యాప్తంగా 4421 కరోనా కేసులు, 114 మరణాలు

Coronavirus in india covid 19 cases tally reaches 4421 in india 114 deaths

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today jumped to 4,421 after nearly 360 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 114 while 326 have recovered, showed the latest data.

కరోనా కాటు: దేశంలో 4421 చేరిన పాజిటివ్ కేసులు.. 114 మరణాలు

Posted: 04/07/2020 10:06 AM IST
Coronavirus in india covid 19 cases tally reaches 4421 in india 114 deaths

కరోనా వైరస్ కరాళ నృత్యంతో దేశవ్యాప్తంగా అనేక మంది దీని బారిన పడ్డారు. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ ఇప్పటికే గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకుంటోంది. ఫలితంగా మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా వంద మార్కు దాటిపోయింది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 326 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గణంకాలను వెలువరించింది.

త కొన్నిరోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 354 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వచ్చే వారంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 748కి చేరింది. గుజరాత్‌లో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 12కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 144గా ఉంది. మధ్యప్రదేశ్‌లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది. మరణాల సంఖ్య తొమ్మిదికి చేరగా 165పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అయితే తాజాగా ఇండోర్‌లో మరో నాలుగు మరణాలు సంభవించినట్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించినవారి సంఖ్య 13కు చేరిందని ఎంజీఎం మెడికల్‌ కాలేజీ ప్రకటించింది. అయితే దీన్ని కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీలో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతోంది. కరోనా కారణంగా ఇక్కడ మొత్తం ఏడుగురు మృతిచెందారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 523కు చేరింది. పంజాబ్‌లో 76కేసులు నమోదుకాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో కరోనా పాజిటివ్‌కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు మరణించగా 621మందికి కరోనా సోకింది. మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. కర్ణాటకలో కొవిడ్‌-19 మహమ్మారి సోకి నలుగురు మరణించారు. పశ్చిమబెంగాల్‌లో కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. కేరళలో కొవిడ్‌19 కేసుల సంఖ్య 327కు చేరగా ఇద్దరు మరణించారు. జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్‌19 కారణంగా ఇద్దరు మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ లో 305కేసులు నమోదు కాగా  ముగ్గురు మరణించారు. బిహార్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles