విదేశాల నుంచి భారత్ కు వచ్చిన స్వదేశీ ప్రయాణికులతో దేశానికి ఆపద ముంచుకొస్తోందని.. కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. గత రెండు నెలలుగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై మరింత నిఘాతో పర్యవేక్షించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ఇప్పటికే రాష్ట్రాల నుంచి అందిన గణంకాలకు, నిఘా పర్యవేక్షణలో వున్న ప్రయాణికుల జాబితాకు మధ్య వత్యాసం వుందని, ఇది ఇలాగే కొనసాగితే దేశానికే అపద ముంచుకొచ్చే ప్రమాదం వుందని ఆయన ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ రాసారు.
విదేశాల నుంచి వచ్చిన వారందరూ ఇప్పుడు నిఘాలో లేరన్న అనుమానాన్ని రాజీవ్ గౌబా వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు, నిఘాలో ఉన్న వారి సంఖ్యకూ తేడా ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈ కారణంతో ఘోర ఆపద ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని పరిమితం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ వ్యత్యాసం విఘాతం కలిగించేలా ఉందని హెచ్చరించిన రాజీవ్ గౌబా, వారిపై మరింత దృష్టిని సారించాలని అన్నారు. వైరస్ ను అరికట్టాలంటే, ఫారిన్ నుంచి వచ్చిన అందరినీ క్వారంటైన్ లో ఉంచాల్సిందేనని సూచించారు.
కాగా, ఇమిగ్రేషన్ విభాగం అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు అందాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలుమార్లు అప్రమత్తం చేసింది. అందరిపైనా నిఘా ఉందని అధికారులు అంటున్నా, పలువురు క్వారంటైన్ స్టాంపులతో బయట తిరుగుతూ ఉండటం, కొన్ని చోట్ల బయటకు వచ్చిన వారిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more