తెలంగాణలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోందా.? అంటే ఔనని చెప్పకతప్పదు. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో దుబాయ్ నుంచి వచ్చిన బెంగళూరు టెక్కీ.. గాంధీలో చికిత్స పోంది పూర్తిగా కోలుకున్న తరువాత.. అతడ్ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే మరో కరోనా కేసు నమోదైనట్లు సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇక రెండో కేసుతో పాటు ఇటలీ నుంచి వచ్చిన మరో ఇద్దరి విషయంలోనూ అనుమానాలు వున్నాయని.. వారిని కూడా క్వారంటైన్ చేస్తున్నారని తెలిపారు. వీరి విషయంలో మరింత సమాచారం వారి వైద్య నివేదికలు వచ్చిన తరువాతే స్పష్టమవుతుందని అన్నారు.
ఇలా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మరో వ్యక్తిలోనూ కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతడ్ని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దాదాపు 12 రోజుల ముందు మంచిర్యాలకు చెందిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. అతడికి ఎలాంటి పరీక్షలు చేయకుండా వదిలేయడంతో నేరుగా తన స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే గత వారం రోజులుగా దగ్గు, జలుబుతో బాదపడుతున్న ఆయనను అక్కడి ఏరియా అస్పత్రిలో చికిత్స అందించారు.
దీంతో జ్వరం కూడా రావడంతో కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించిన వైద్యులు.. సదరు రోగిని గాంధీ అసుపత్రికి చికిత్ప నిమిత్తం పంపించారు. ఇక అడ్మిట్ చేసిన వైద్యులు అతడ్ని పరీక్షలు నిర్వహించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపారు. నివేదికలపై ఆధారపడి అతడికి చికిత్సలను చేయనున్నారు. కాగా దుబాయ్ నుంచి సికింద్రాబాద్ వయా బెంగళూరుకు వచ్చిన యువకుడు కరోనా వ్యాధి నుంచి విముక్తి పోందాడు. కాగా ఒకరు చికిత్స విజయవంతం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న అధికారులకు మరిన్ని అనుమానిత కేసులు పెరగడం కూడా కలవరానికి గురిచేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more