రాజధాని అమరావతిని శాసన రాజధానిగా మారుస్తూ.. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన వెంటనే ఇక్కడ భూఅక్రమార్కులు రెక్కలు కట్టుకుని వాలిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న వత్యాసం లేకుండా ఎవరి భూమి పడితేవారి భూమిని అక్రమార్కులు తమ కబంధహస్తాల్లోకి తీసుకుంటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. విశాఖపట్నంలో లేని సంస్కృతికి అక్రమార్కులు అపాదిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖలో గత రెండు మూడు నెలలుగా అనేక భూ కబ్జాలు వెలుగుచూశాయని పేర్కోన్న ఆయన తమ పార్టీ కార్యాలయానికి ఆనుకుని వున్న భూమిని కూడా అక్రమార్కులు గన్ పాయింట్ లో తుపాకులు పెట్టి బెదిరించి మరీ కబ్జాచేశారని అరోపించారు. అంతేకాదు తనకు చెందిన సొంతభూమిని కూడా అక్రమార్కులు కబ్జాచేశారని ఆయన తెలిపారు. తన మనుషులను పంపితే అప్పటికే కంచె వేసిన అక్రమార్కులు.. ఈ భూమి బీజేపి అధ్యక్షుడిదని తెలియదని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని తన భూమి పక్కనే భూమి వున్న ఓ పోలీసు అధికారి చెబితే కానీ తనకు తెలియదని చెప్పుకోచ్చారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పాడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని ఆరోపించారు. తుపాకీ గురిపెట్టి మరీ సెటిల్ మెంట్లు చేస్తున్నారని లక్ష్మీనారాయణ మండిపడ్డారు. భీమిలి సమీపంలో స్వయంగా తాను 1993లో చేపలుప్పాడలో తాను స్థలం కొనుగోలు చేశానని, పక్కనే ఓ పోలీసు అధికారి కూడా స్థలం కొనుగోలు చేశారని చెప్పారు. అయితే ఓ రోజు ఆ పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి.. తమ ఇద్దరి భూములు కబ్జా చేశారని చెప్పినట్లు వివరించారు.
దీంతో వెంటనే తన మనుషులను పంపించి తన భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించారని గుర్తు చేసుకున్నారు. అదేంటని అడిగితే ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అని అనుకోలేదని కబ్జాదారులు చెప్పారని వ్యాఖ్యానించారు. తన మాదిరిగానే విశాఖలో భూ మాఫియాకు వందలాది మంది బాధితులయ్యారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాక అక్కడి ప్రజలే కాక, చుట్టుపక్క జిల్లాల ప్రజలు కూడా భయపడుతున్నారని చెప్పారు. ఓ వైపు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడం.. వేసినవారి ఇళ్లల్లో అక్రమంగా మద్యం సీసాలు పెట్టించి అక్రమంగా కేసులు బనాయించడం.. నామినేషన్ వెసేందుకు వెళితే అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్ పత్రాలను లాక్కుని వెళ్లడం.. లేదా నామినేషన్ దాఖలు చేయకుండా అధికారులతో వేధించడం వంటి చర్యలను అధికార ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని తాను కేంద్రాన్ని కోరుతానని కన్నా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more