నిన్నటి తరం హీరోయిన్.. బీజేపి పార్లమెంటు సభ్యురాలు జయప్రదపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ఈ ఎన్బీడబ్యూ వారెంట్ ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై కోర్టు ఆమెపై ఆ వారంట్ జారీ చేసింది. ఈ కేసు తరుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా జయప్రద తనపై జారీ అయిన నాన్ బెయిలెబుల్ వారెంట్ ను రికాల్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
అసలు కేసు ఏమిటీ అన్న వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమె ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోడ్ ను ఉల్లంఘించారన్న అభియోగాలపై పోలీసులు జయప్రదపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల సమయంలో అమె సమాజ్ వాదీ పార్టీ నుంచి వీడి బీజేపిలో చేరిన విషయం తెలిసిందే.
దీంతో రాంపూర్ లోక్ సభ స్థానంలో అసక్తికర పోటీ ఏర్పడింది. గతంలో ఓ సారి జయప్రద ఎస్పీ పార్టీ తరపున ఇక్కడి నుంచి బరిలో దిగి గెలిచారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ నేత అజాం ఖాన్ కు కంచుకోటగా మార్చుకున్న అదే నియోజకవర్గంలో ఆయనపైనే జయప్రద పోటీకి దిగడంతో ఇరువురి మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తోసిరాజుతూ అజాం ఖాన్ పై అమె పలు వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలో కేసు నమోదైంది. కాగా, సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్.. జయప్రద చేతిలో లక్ష ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more