విదేశాలకు వెళ్లిన పర్యాటకులతో లేదా విదేశీ పర్యటనలకు వెళ్లిన స్వదేశీయులతో మాత్రమే కరోనా వైరస్ దేశంలోకి చోచ్చుకొచ్చిందని వైద్యులు చెబుతున్న క్రమంలో భారత వైద్య అరోగ్యశాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో దానిని వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చునని వైద్యముఖ్యుల సూచనలతో సిక్కిం రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
తమ రాష్ట్రానికి విదేశీ పర్యటాకుల తాకిడి అధికంగా వున్న నేపథ్యంలో కరోనా వ్యాధి రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా తమ రాష్ట్రంలోకి విదేశీ పర్యాటకులకు ప్రవేశం లేదంటూ చైనా సరిహద్దుల్లోని సిక్కిం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. రాష్ట్ర పరిధిలోని గ్యాంగ్ టక్, డార్జిలింగ్, నాథులా తదితర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ లో విదేశీయులందరి బుకింగ్స్ నూ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మామూలుగా అయితే, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికన్లతో పాటు ఫ్రెంచ్, జర్మన్లు, జపనీయులు, చైనీయులు సిక్కిం రాష్ట్రానికి పర్యటనల నిమిత్తం వస్తుంటారు. విదేశీ పర్యాటకులను తీసుకుని రావద్దని వివిధ టూర్ ఆపరేటర్లకు సైతం ఆదేశాలు జారీ అయ్యాయి. పర్మిట్ల జారీని సైతం నిషేధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి సిక్కిం, డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులు వారం రోజుల పర్యటనకు వస్తుంటారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ టూరిస్టులను ఎవరినీ అనుమతించవద్దని ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు క్లబ్ సైడ్ టూర్స్ అండ్ ట్రావెల్ యజమాని అమిత్ పెరివాల్ వెల్లడించారు.
హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం
కరోనావైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యాధి భారిన పడిన పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న క్రమంలో మిగిలిన రాష్ట్రాలను కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని అదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more