యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ నగరంలో కూడా జడలు విప్పుతోందా.? వాస్తవానికి వాతావరణంలో ఉష్ణ స్థితి అధికంగా వుండే భారతదేశంలో అందులోనూ డెక్కన్ ప్ల్యాటూగా ఏర్పడిన దక్షిణ ప్రాంతంలోనూ ఈ వ్యాధి వ్యాప్తి. దాని ప్రభావం అంతగా వుండదని ఇప్పటికే పలువిధాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోగ నిరోధక శక్తి అధికంగా లేని చిన్నారులు, డెబ్బై ఏళ్లు నిండిన పెద్దల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు.
వీరితో పాటు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచనలుఇస్తున్నారు. ఈ క్రమంలో బిపి పేషంట్లు, హృద్రోగులు, డయాబెటిస్ గ్రస్తులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలన్న సూచనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ నుంచి బెంగళూరు, అక్కడి నుంచి సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్ లోని తన స్వగృహానికి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు ఈ వ్యాధి సోకడంతో, అతడికి గాంధీ అసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.
ఈ సూచనల నేపథ్యంలోతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే, వారు సెలవు తీసుకోవచ్చునని పేర్కోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా వుండటం.. వారు తమ సమస్యను ప్రారంభంలోనే చెప్పలేకపోవడంతో.. వ్యాధి విద్యార్థులందరికీ ప్రబలే అవకాశాలు అధికంగా వుంటాయని భావించిన విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యాలయం, జిల్లాల పరిధిలో డీఈఓలు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులు జాగ్రత్త చర్యలు పాటించడంలోనూ పెద్దగా శ్రద్ద చూపనందున వారిని వారి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వుంచడం సముచితమని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థులైనా, టీచర్లకు అయినా జలుబు, జ్వరం, శ్వాస సంబంధింత సమస్యలుంటే, మూడు రోజులు బడికి రావద్దని, లక్షణాలు తగ్గేంత వరకూ చికిత్స తీసుకోవాలని విద్యా శాఖ కోరింది. ప్రతి సోమవారం పాఠశాల అసెంబ్లీలో వైరస్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని అదేశించింది.
ఇక దీంతోపాటు స్కూలు జరుగుతున్న సమయంలో కనీసం నాలుగు సార్లు చేతులను కడుక్కునేందుకు అవసరమైన లిక్విడ్స్ అందుబాటులో ఉంచాలన్న విద్యాశాఖ ఈ అదేశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు తప్పక పాటించాలని పేర్కొంది. ఇదే విషయాన్ని నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే చేయాలని, స్కూలు తలుపులను సబ్బు నీటితో శుభ్రం చేయించాలని ఆదేశించింది. విద్యార్థులు తరచూ చేతులు కడుక్కుంటూ ఉండేలా చూడాలని సూచించింది. ఎవరైనా కరోనా బాధిత దేశాల నుంచి వచ్చిన వారి పిల్లలు స్కూల్ లో చదువుతుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more