శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని.. నానుడి.. అనుకుంటాం కానీ అలా కూడా జరుగుతుందా.? అన్న అనుమానాలు అప్పుడప్పుడు కలగక మానవు. కానీ ఇది నిజంగానే నిజమనే ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి ప్రధాన కూడలిలో జరిగింది. అదృష్టవంతుడైన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా, ఒకటి కాదు రెండు లారీలు అతని వెంటే అదే మార్గంలో వచ్చాయి. రెండూ ఒకే వైపుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే లారీలు రెండు ఢీకొన్నాయే తప్ప.. రోడ్డు దాటుతున్న అదృష్టవంతుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
వింటుంటే కాస్తా విస్మయానికి గురిచేసే ఘటన ఇది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించిన ఘటన నేపథ్యంలో అటు సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలు, ఇటు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వెళ్లే వాహనాలతో రోడ్డు మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఢీకొన్న రెండు లారీలను క్లియర్ చేసి.. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఈ ఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తం కావడంతో తప్పించుకున్న వ్యక్తిని మృత్యుంజయుడిగా స్థానికులు పేర్కొంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెల్లవారుజామున ఒకే వైపు వెళ్తున్న రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. కాగా రెండు లారీల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. అయితే తనకు ఎడమ వైపుగా వస్తున్న లారీని గమనించిన వ్యక్తి కుడి వైపుకి పరుగు తీశాడు. ఈలోగా వెనుక నుంచి మరో లారీ కూడా వస్తుందని తెలియడంతో ముందుకు పరుగు తీశాడు. ఈ క్రమంలో వ్యక్తికి ఎడమ వైపు లారీ డ్రైవర్ ముందుగా బ్రేక్ వేశాడు. ఆ తరువాత కుడి వైపు లారీ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి వెనుక బాగంలోని లోడ్ మాత్రం ఎడమవైపు లారీపై పడింది. మరో రకంగా ఆ లారీ సపోర్టుతోనే అగింది.
కాగా, ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. మృత్యువు రెండు వైపుల నుంచి లారీల రూపంలో వచ్చినా.. ప్రాణాలతో బయటపడటంతో అందరూ సదరు వ్యక్తిని అదృష్టవంతుడిగా పేర్కొంటున్నారు. ఈ ఘటన క్రమంలో అక్కడున్న వారు వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు లారీల డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి.. తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more