at-least-25-killed-after-private-bus-falls-into-a-river-in-bundi 25మంది ప్రాణాలు తీసిన అతివేగం.. అదుపుతప్పి నదిలో బస్సు..

Rajasthan accident at least 25 killed after private bus falls into a river in bundi

rajasthan accident, rajasthan accident today, bundi accident, bundi bus accident, bundi accident news, bundi news, Kota Lalsot Mega Highway, maiz river, bus falls in river, bundi, rajasthan accident, bundi accident, bus accident, sawai madhopur, ashok gehlot, mej river, rajasthan, Crime

At least 25 people died and four others were injured when a private bus fell into a river in Rajasthan's Bundi district on Wednesday. The accident took place around 9 am at Kota-Dausa highway in Bundi.

ITEMVIDEOS: 25మంది ప్రాణాలు తీసిన అతివేగం.. అదుపుతప్పి నదిలో బస్సు..

Posted: 02/26/2020 03:08 PM IST
Rajasthan accident at least 25 killed after private bus falls into a river in bundi

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోట లాల్‌సోట్ వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్ సాత్‌ మెగా హైవేపై బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కొంతమందిని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్ మాధోపూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో బోల్తాపడింది. ఘటన సమయంలో బస్సులో వున్న కొందరిని స్థానికులు కాపాడారు. కాగా మృతుల్లో 10 మంది మహిళలు, 11 మంది పురుషులు, నలుగురు చిన్నారులు వున్నారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలోనే పది మంది చనిపోగా, ఆసుపత్రులకు తరలిస్తుండగా 15 మంది మరణించారని తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా క్షతగాత్రులలో మరో 5 మందికి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. కాగా వంతెనలోకి దూసుకెళ్లకుండా ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడలు కానీ, నిర్మాణాలు కానీ లేవని సమాచారం. మృతులందరూ కోటాకు చెందిన ఓ కుటుంబం బంధువులు కావడంలో ఇప్పుడా ఇంట్లో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనీవాల్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bundi  rajasthan accident  bundi accident  bus accident  sawai madhopur  ashok gehlot  mej river  rajasthan  Crime  

Other Articles