హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెట్రో రెండు దశలో భాగంగా.. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు మెట్రో రైలు సేవలను విస్తరించడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఇప్పటికే డీపీఆర్ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. మూడు కారిడార్ల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో రైలుతో అనుసంధానించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
నూతన మార్గాలివే..
రెండో దశలో భాగంగా.. ముందుగా రాయదుర్గం నుంచి ఆర్జీఐఏకు 31 కి.మీ. మేర నూతన మార్గం నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం పశ్చిమం నుంచి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేస్తోందని, దీంతో పాటు నాగోల్ నుంచి ఆర్జీఐఏ మరో మార్గం కనెక్ట్ చేస్తోందని అన్నారు, ఇక నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మార్గం విస్తరించాలని, అలాగే మియాపూర్ నుంచి బిహెచ్ఈఎల్ వరకు విస్తరించాల్సి వుందన్నారు. ఇక బిహెచ్ఇఎల్ నుంచి ఆల్విన్ ప్రధాన కూడలి, హఫీజ్ పేట్, కొండాపూర్, పాత ముంబై హైవే రోడ్డు మీదుగా లక్డీకాపూల్ వరకు నూతన మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు.
పాతబస్తీలో 5 కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో కారిడార్ -2లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఇటీవలే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మార్గంలో ఫలక్నుమా వరకు మరో 5 కి.మీ. మేర నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో మార్గం ప్రారంభంతో హైదరాబాద్ మెట్రో నయా రికార్డులు నెలకొల్పుతోంది. ఈ మార్గం ప్రారంభంతో మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ మెట్రోకి రోజుకి రూ. కోటి ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడించారు. మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 16 కోట్ల మందికి పైగా మెట్రోలో ప్రయాణించారని ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more