జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా అమరవీరులకు ఓ వైపు నివాళులు అర్పిస్తూనే మరోవైపు అధికార బీజేపి ప్రభుత్వంపై ఇదే సందర్బంలో విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ. ఈ దాడి నేపథ్యంలో ఏడాది క్రితం తెరపైకి వచ్చిన ప్రశ్నలతో పాటు మరికొన్ని ప్రశ్నలను సంధించారు రాహుల్. ఈ దాడి వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందని ప్రశ్నించిన ఆయన.. తన మూడు ప్రశ్నలకు ప్రభుత్వం లేదా అధికార పార్టీ సమాధానాలు చెప్పాలంటూ నిలదీశారు.
‘పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ అమర జవాన్లను మనం ఈ రోజు స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్రాన్ని మనం అడగాల్సినవి ఇవే..
1. ఈ దాడితో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది?
2. దాడిపై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది?
3. దాడికి కారణమైన భద్రతా లోపాలకు బీజేపి ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తున్నారు?’ అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. గతేడాది ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ఆయన ఆధీనంలో వున్న ఇంటెలిజెన్స్ శాఖ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని అరోపించారు. అంతటితో ఆగని రాహుల్.. పుల్వామా దాడి జరిగిన సమయంలో ప్రదాని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ప్రివ్యూ వేడుకలో బిజిగా వున్నారని, దాడి ఘటన జరిగిన గంటకు కానీ ఆయన దానిపై సమీక్షించలేనంత బిజీగా వున్నారని వ్యంగస్త్రాలు సంధించారు.
గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో యావత్ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మన భద్రత, నిఘా వ్యవస్థపై అనేక సందేహాలకు ఈ దాడి కారణమైంది. ఈ దాడి తర్వాత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇటీవల ఉగ్రవాదులకు సాయం చేస్తూ పట్టుబడిన కశ్మీర్ పోలీసు అధికారి దవీందర్ సింగ్ కు కూడా పుల్వామా దాడితో సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన తాజా ట్వీట్ మరోసారి రాజకీయ వివాదానికి తెరతీసే అవకాశం కన్పిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more