youth suicides in Telugu states on valantines day ప్రేమ తీసిన ప్రాణం: ప్రేమికుల రోజునే విషాదం..

Youth suicides in telangana and andhra pradesh on valantines day

Krishna, Emmigannur, kurnool, valantine's day, suicide, youth suicides, shadnagar, rangareddy, pesticides, Telangana, Andhra Pradesh, Crime

In a panic incident Youth from telugu states commit suicide on valantine's day as their love turned to be failure. A student from kurnool and a young man from rangareddy comit suicide in two different cases on lovers day.

ప్రేమ తీసిన ప్రాణం: ప్రేమికుల రోజునే విషాదం..

Posted: 02/14/2020 05:06 PM IST
Youth suicides in telangana and andhra pradesh on valantines day

వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. ఈ రోజునే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు యువకులు బలవంతంగా తనువు చాలించారు. ప్రేమికుల రోజు సాక్షిగా చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కృష్ణ అనే యువకుడు ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వాలెంటైన్స్ డే రోజున తన ప్రేమను చిగురించాలని భావించిన యువకుడు విఫలం కావడంతో.. తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణ.. తన కాలనీలో రమారమి అందరికీ సుపరిచితుడు. నిత్యం యాక్టివ్ గా వుండే యువకుడు అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. చెట్టంత కొడుకు ఇలా ప్రాణాలు తీసుకోడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కృష్ణ ఆత్మహత్య గురించి తెలిసి స్నేహితులు షాకయ్యారు. ప్రేమికుల రోజే కృష్ణ ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. యువతికుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటు తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ యువకుడు కూడా తన ప్రేమ విఫలం అవుతుందన్న కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో ప్రాణాలు తీసుకున్నాడు. పురుగుల మందు తాగి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత రాత్రైన కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు అతడి కోసం చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది.  

కొందుర్గు మండల కేంద్రానికి చెందిన విజయ్‌(24) షాద్‌నగర్‌ సమీపంలోని దూసకల్‌ రోడ్డులో కంపెనీలో పనిచేస్తున్నాడు. స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్.. కంపెనీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి.. శవమై కనిపించాడు. షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌ సమీపంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో కాచిగూడ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మృతుడి చొక్కా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా విజయ్‌గా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహానికి షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రేమ విఫలం కావడంతో విజయ్ కొద్దిరోజులుగా మనస్తాపంగా ఉంటున్నాడని, అయితే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని ఊహించలేదని తల్లిదండ్రులు, అతడి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles