సురక్షిత మంచినీరు ప్రజలకు పంపిణీ చేయడం ప్రభుత్వాల బాధ్యత అన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నా.. వ్యాపార సంస్థలు మాత్రం చక్కగా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటున్నాయి. మినరల్ వాటర్ అన్న పేరుతో ఫ్యాకేజ్డ్ నీటిని విక్రయిస్తూ దశాబ్దాలుగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఓ వైపు 20 లీటర్ల క్యాన్ రూ.20కి బయట మార్కెట్లలో లభిస్తుండగా, అదే బాటిల్ ను కేవలం రూ.5కు ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు, డ్వాక్రా సంఘాలు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయినా లీటర్ వాటర్ బాటిల్ ధర మాత్రం కనిష్టంగా రూ.20 వద్దే ఉంటోంది.
రైల్వేలో రూ.15కే అందించాలని కేంద్రం అదేశించినా.. ఇది కొన్ని స్టేషన్లలో మినహాయించి ఎక్కడా.. మరీ ముఖ్యంగా రైళ్లలో అస్సలు కనిపించదు. వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఈ నేపథ్యంలో కేవలం లీటర్ వాటర్ బాటిల్ ధర మాత్రం 20 నుంచి 25 రూపాయల మధ్యకు చేరుకుంది. ఇక సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్సులు.. ఇతర జనసామర్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో ఈ ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దాహమేసి గుక్కెడు నీళ్లు తాగాలంటే లీటర్ బాటిల్ పై రూ.20 వసూలు చేస్తున్నారు. వాటర్ బాటిల్ కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు.
పెంచిన వాటర్ బాటిళ్ల ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో నిత్యావసర వస్తువుల చట్టం కిందకు వాటర్ బాటిళ్ల ధరను తీసుకురావాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్ బాటిల్ ధరలపై నియంత్రించేందుకు వీలుగా లీటర్ వాటర్ బాటిల్ ధరను రూ.13లుగా ఫిక్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది లెఫ్ట్ గవర్నమెంట్. కేరళలో ప్రస్తుతం ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఖరీదు ఉంది. ఆహారం, పౌర సరఫరాల మంత్రి పి.థిలోత్తమన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వాటర్ బాటిల్ ధరలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘రాష్ట్రంలో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13 ఖరీదు. రెండు రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయి. ప్రజల అభిప్రాయాల మేరకు నిత్యావసర వస్తువుల కేటగిరి కిందికి వాటర్ బాటిల్ ధరలను తీసుకొచ్చింది’ అని థిలోత్తమన్ చెప్పారు. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం వాటర్ బాటిల్ ధరను రూ.11 నుంచి రూ.12లకు తగ్గించాలని భావించింది. అదే సమయంలో బాటిల్ వాటర్ తయారీదారులు, ట్రేడర్లు భారీ స్థాయిలో ఆందోళనకు దిగడంతో అమలు చేయడం కుదరలేదని మంత్రి అన్నారు. కేరళలో ఇప్పుడు ఎవరైనా లీటర్ వాటర్ బాటిల్ ధరను రూ.13 కంటే ఎక్కువగా ప్యాకేజీతో అమ్మితే అది నేరంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more