రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 49 రోజులుగా అమరావతి ప్రాంత రైతుల అందోళనలు చేపడుతున్న క్రమంలో అమరావతి ప్రాంత రైతులు అందోళనలను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంశంపై తొలిసారిగా కేంద్రప్రభుత్వం స్పందించింది. గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజదాని విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రప్రభుత్వానిదేనని ఆయన తేల్చిచెప్పారు.
రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో ఏక్కడైనా ఏర్పాటు చేసుకునే వెసలుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి వుంటుందని నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్ 23న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. కాగా, నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది’’ అని నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు.
మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్రప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, యువజనులు ఉద్థృతంగా అందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన తమకు అన్యాయం చేయడమేంటని ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే లాఠీఛార్జి చేస్తారా? అని ప్రశ్నించారు. చలో అసెబ్లీకి పిలుపునిస్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సభ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రహోంశాఖ లిఖితపూర్వకంగా జయదేవ్ కు సమాధానమిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more