దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు తమకు విధించిన మరణశిక్షను తప్పించుకునేందుకు పిటీషన్లపై పిటీషన్లు దాఖలు చేస్తూ.. వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారని, ఈ విషయంలో భారత రాష్ట్రపతి లేదా ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని అప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు. దేశంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వేస్తారని తెలిసినా.. శిక్షలను అమలు కానీయకుండా దోషులు కూడా వాయిదాలపై వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తున్న నేపథ్యంలో దేశప్రజలందరూ ఆసంతృప్తితో వున్నారని అన్నారు.
రాజ్యసభలో నిర్భయ ఘటనపై చర్చను లేవనెత్తిన ఆయన దేశప్రజలు ఇలాంటి నేరాలను తిప్పకొడతామంటూ రోడ్లపైకి వచ్చిన విషయాన్ని మర్చిపోరాదని అన్నారు. ఈ క్రమంలో శిక్షను అమలు పర్చడంలో జాప్యం జరిగడం సహేతుకం కాదని అన్నారు. దీనిపై తక్షణం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లేదా భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాడ్బే లు జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ నిర్భయ అంశం చాలా సున్నితమైనదని, అలాగే చాలా సీరియన్ అంశమని అన్నారు. ఈ విషయంలో న్యాయస్థానాల తీర్పును సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని అన్నారు.
నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న ఉరి శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్ జారీ అయ్యింది. ఆ తరువాత అది ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఇక ఫ్రిబవరి ఒకటిన మరోమారు వాయిదా పడిన శిక్ష అమలు తదుపరి ఉత్తర్వులు ఎపుడు వస్తాయా.? అని వేచిచూసే పరిస్థితి వచ్చిందని పేర్కోంటూ.. దామిని చిత్రంలో తారీఖ్ పే తారీఖ్ అనే పాపులర్ డైలాగ్ ను వినియోగించారు. ఈ క్రమంలో రాజకీయ కారణాలు కూడా దోషులకు శిక్షను అమలు కానీయకుండా చేస్తున్నాయని సంజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ అంశంలో ఢిల్లీలోని అప్ ప్రభుత్వం కూడా దోషులకు శిక్షను అమలు చేయడంలో జాప్యం చేసిందని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more