తల్లిదండ్రులకు తోడు ఇద్దరు పిల్లలున్న కుటుంబంపై విధి అది నుంచి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. వారి దాంపత్యకుటుంబానికి చిహ్నంగా పుట్టిన మొదటి బిడ్డ పుట్టుకతోనే విధి ఆ కుటుంబంపై తన ప్రతాపాన్ని చూపింది. తొలి సంతానమైన మగబిడ్డకు అంగవైకల్యం.. అడుగు తీసి అడుగు వేయలేదు. దీనికి తోడు అతడు మాట్లాడలేడు, ఇక తన అవసరాలను కనిపెట్టుకుని కన్నవారే అందులోనూ కన్నతల్లే అతడికి అన్ని సపర్యలు చేసేది. తన బిడ్డ ఆకలిని ఎరిగి ముద్ద ముద్ద కలిపి తినిపించేది. ఇలా తల్లి ఆ కొడుకును చూసుకుంటుందన్న ఈర్ష కలిగిందో ఏమో కానీ ఆ బాబుకు ఏడేళ్ల వయస్సులోనే విధి ఆ తల్లిని మృత్యువు రూపంలో దూరం చేసింది.
ఇక ఈ బాలుడితో పాటు ఏడాది వయస్సున్న చిన్నబ్బాయికి కూడా అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడా తండ్రి. తల్లి మరణించి పదేళ్లు అవుతున్నా ఇంకా బాగానే వున్నారని అనుకుందో ఏమో కానీ మరోసారి విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. అండగా ఉంటున్న తండ్రిపై ‘కరోనా’ కాటు వేసింది. కనీసం తోడుగా వుంటాడని భావించిన తమ్ముడిని కాలు వేసింది. దీంతో దివ్యాంగుడ్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి తండ్రి, చిన్నకొడుడు ప్రభుత్వ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. అయితే తన ఆకలిని గుర్తించి ముద్దపెట్టే వారు లేకపోవడంతో క్షుద్భాదతో ఆ పెద్దబ్బాయి మరణించాడు. ‘కరోనా’ మహమ్మారి ప్రత్యక్షంగా తీస్తున్న ప్రాణాలకు తోడు ఇలా పరోక్ష మరణాలు కూడా ఎన్నో. కరోనా కాటుకు ఎన్నో కుటుంబాలు ఛిధ్రం అవుతున్నాయని ఈ ఘటనే ఉదాహరణ.
చైనాలోని హుబి ప్రావిన్స్ కు చెందిన యాన్ జియోవెన్ దంపతుల పెద్ద కుమారుడు యాన్ చెంగ్ వయసు 17ఏళ్లు. పుట్టుకతోనే సెరబ్రల్ పాల్సీ వ్యాధి రావడంతో అతడు కదల్లేడు, నడవలేదు.. దీనికి తోడు కనీసం మాట్లాడలేదు. చెంగ్ 11ఏళ్ల తమ్ముడు కూడా ఆటిజంతో బాధపడుతున్నాడు. కుమారులిద్దరూ అంగవైకల్యంతో పుట్టడంతో మనస్తాపానికి గురైన జియోవెన్ భార్య పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి తండ్రి యాన్ జియోవెన్ అన్నీ తానై కొడుకులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు.
ఇటీవల యాన్ జియోవెన్, తన రెండో కుమారుడితో కలిసి వుహాన్ వెళ్లొచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ అనారోగ్యానికి గురవడంతో జనవరి 22న ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల తర్వాత వీరికి ప్రాణాంతక కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి జియోవెన్, ఆయన చిన్న కొడుకును ఆసుపత్రివర్గాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్దకొడుకు ఆకలి తీర్చాలని ఆయన సోషల్ మీడియా వేదికగా తన స్నేహితుల్ని, ఇరుగుపోరుగువారిని, బంధువులను కోరాడు.
అయితే ఇరుగుపోరుగు వారు ముందకు కోచ్చి అప్పటికే క్షుద్భాధతో నిరసించిన పెద్దబ్బాయికి జ్యూస్ ఇచ్చారు. ఇక మరుసటి రోజు ఉదయానికి ఆయన మరణించాడు. తండ్రి ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి ఆహారం లేక జనవరి 29నే యాన్ చెంగ్ కన్నుమూశాడు. యాన్ మృతికి గల కారణాన్ని తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపై జాయింట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కారణాలను సేకరించనున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుడు యాన్ చెంగ్ కు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని అధికారులు పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more