ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులను ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. దళిత వర్గానికి చెందిన డాక్టర్ సాకే శైలజానాథ్ ను పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించారు. తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటి వరకూ బీసీ సామాజిక వర్గానికి చెందిన రఘువీరా రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు.
ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రఘువీరా స్థానంలో దళితుడికి అవకాశం ఇవ్వడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు రాజీనామాలు చేయగా.. అదే బాటలోనే రఘువీరా కూడా తన పదవికి రాజీనామా సమర్పించారు. అయితే రఘువీరా రాజీనామాను కాంగ్రెస్ హైకమాండ్ అప్పట్లో ఆమోదించలేదు. గత కొంత కాలంగా రఘువీరా రాజకీయాల్లో యాక్టింగ్ గా ఉండటం లేదు.
అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్.. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున సింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్ర మంత్రిగానూ సేవలందించారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హాయంలోనూ ఆయన మంత్రిగా బాద్యతలను నిర్వర్తించారు. అదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఒకానొక దశలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో మళ్లీ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే కార్యచరణ ప్రారంభించింది. అందుకే ఒకప్పుడు తమకు అండగా నిలిచిన దళిత, రెడ్డి, ముస్లిం వర్గాలకు పీసీసీ పదవులను కట్టబెట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more